యాప్నగరం

Medchal: 100కు పైగా వీధి కుక్కలు మృతి.. వారి పనేనా?

Medchal Stray Dogs: మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో వీధి కుక్కల అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. 100కు పైగా కుక్కలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది విష ప్రయోగం చేయటం వల్లే కుక్కలు మృతి చెందాయని ఓ జంతు ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 1 May 2023, 12:21 pm

ప్రధానాంశాలు:

  • మేడ్చల్ జిల్లాలో వీధి కుక్కలు మృతి
  • 100కు పైగా కుక్కలు మృతి
  • విచారణ చేపట్టిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Medchal Stray Dogs
వీధి కుక్కల మృతి
Stray dogs died: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, ఒంటరిగా వెళ్లేవారే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. రెండు నెలల క్రితం వీధికుక్కల దాడిలో హైదరాబాద్ అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందటం సంచలనం సృష్టించింది. ఆ ఘటన పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో వీధి కుక్కలను కట్టడి చేయాలంటూ ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లాలో వీధి కుక్కలు మృతి చెందటం కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా వీధి కుక్కలు మృతి చెందాయి. మేడ్చల్ జిల్లాలోని తుర్కపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలపై చలించిపోయిన ఓ జంతు ప్రేమికులు శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి గ్రామంలో వీధి కుక్కలకు విష ప్రయోగం జరిగిందని.. బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికురాలు శశికల శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వీధి కుక్క కళేభరాన్ని తీసుకుని ఆమె శామీర్ పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద స్థితిలో శునకాలు మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన కుక్కకు పోలీసులు వెటర్నరీ డాక్టర్ల చేత పోస్టుమార్టం నిర్వహించారు. శునకం మృతికి సంబంధించిన రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై శామీర్ పేట ఎస్సై మునీందర్ తుర్కపల్లి గ్రామంలో విచారణ చేపట్టగా.. గ్రామస్థులు, పంచాయతీ అధికారుల నుంచి సరైన సమాధానం రానట్లు తెలిసింది. అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది విషం పెట్టటం వల్లే కుక్కలు మృతి చెందాయని వారిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికురాలు శశికళ డిమాండ్ చేస్తున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.