యాప్నగరం

మాతృదినోత్సవం రోజున విషాదం.. ఇద్దరు పిల్లలను చంపేసి తల్లి ఆత్మహత్యాయత్నం

Meerpet: హైదరాబాద్ శివారు మీర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను చంపి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్తతో గొడవపెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 14 May 2023, 9:01 pm

ప్రధానాంశాలు:

  • మీర్‌పేటలో దారుణం
  • ఇద్దరు పిల్లలను చంపేసిన తల్లి
  • ఆపై తాను ఆత్మహత్యాయత్నం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Meerpet Mother
బిడ్డలను చంపిన తల్లి
Meerpet Mother: మాతృదినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లను చంపి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ శివారు మీర్‌పేటలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని కుబ్యా తండాకు చెందిన శ్రీనివాస్‌, భారతి దంపతులకు 2020లో పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరు మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలోని జిల్లెలగూడలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు విక్కీ (18 నెలలు), లక్కీ (8 నెలలు) ఉన్నారు. శనివారం శ్రీనివాస్ తల్లి వీరి ఇంటి వద్దకు రాగా.. దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇవాళ ఉదయం భారతి తల్లిదండ్రులు కూడా శ్రీనివాస్ ఇంటికి రాగా.. మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.

అనంతరం శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన భారతి (26) ఇవాళ సాయంత్రం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్‌లో ముంచి చంపేసింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిల్లల్ని చంపి విషం తాగిన విషయాన్ని స్వయంగా భర్తకు ఫోన్ చేసి చెప్పింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న శ్రీనివాస్.. పిల్లలను, భార్యను దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

భార్య భారతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మాతృదినోత్సం రోజున ఇద్దరు పిల్లను చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.