YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ వ్యవహారం రసవత్తరంగా మారింది. పంజాగుట్టలో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించగా.. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. షర్మిలతో పాటు ఏడుగురిని పంజాగుట్ట పోలీసులు 14 ఏసీ ఎంఎం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. సుదీర్ఘంగా విచారణ అనంతరం కోర్టు.. షర్మిలతో పాటు మరో ఐదుగురిని బెయిల్ మంజూరు చేసింది. కాగా.. షర్మిలను రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా.. షర్మిల తరఫు న్యాయవాది ఖండించారు. తన క్లయింట్పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆమె తరఫు లాయర్ వాదించారు. శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. పోలీసుల తీరును తప్పుబట్టారు. గతంలో రాజాసింగ్ రిమాండ్ను న్యాయవాది ప్రస్తావించారు. పోలీస్ విధులకు షర్మిల ఎక్కడా కూడా ఆటంకం కలిగింలేదన్నారు. ఇదిలా ఉంటే.. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉండటం వల్లే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ముందస్తుగా సహకరించాలి అని కోరినా వినకపోవటం వల్ల.. రోడ్డుపై షర్మిల, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేటయ్యిందన్నారు. ఈ సమయంలో రిమాండ్ విధించకపోతే లా అండ్ అడర్ సమస్య వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే.. తన పాదయాత్రలో భాగంగా సోమవారం ఆమెపై జరిగిన దాడిలో షర్మిల కారుతో పాటు బస్ అద్దాలు ధ్వంసం కావటానికి నిరసనగా.. ఈరోజు సోమాజిగూడ నుండి ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రగతి భవన్కు వెళ్లి కేసిఆర్కు తన వాహనాలను చూపించే వరకు తాను ఇక్కడి నుండి కదిలేది లేదంటూ కారు అద్దాలు క్లోజ్ చేసుకుని షర్మిల మౌనంగా కూర్చుండిపోయారు. దీంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామై.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదేవీ లేక పోలీసులు కారుతో సహా వైయస్ షర్మిలను ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు.
అయితే.. షర్మిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిలపై పంజాగుట్ట ఎస్సై అఖిల ఫిర్యాదు చేశారు. రాష్ అండ్ నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తూ తమపైకు వాహనం దూసుకొచ్చేటట్టు షర్మిల కారు నడిపించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా షర్మిల అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుండగా.. వీడియో చిత్రీకరిస్తున్న ఎస్సై మొబైల్ ఫోన్ లాక్కోవటంతో.. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు షర్మిలతో పాటు మరో ఏడుగురిపై 143-గుమిగూడటం, 341-అక్రమ నిర్బంధం, 290-బూతులు తిట్టడం, పబ్లిక్ న్యూసెన్స్, 506-బెదిరింపు, 509- మహిళలను దూషించడం, 336-ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించటం, 353- పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, 382- చోరీ, 149- అక్రమ సమావేశం, 382 ఐపీసీ- దొంగతనం.. లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు షర్మిలతో పాటు ఆరుగురిని రిమాండ్ నిమిత్తం చంచలగూడా జైలుకి తరలించారు.
అయితే.. షర్మిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిలపై పంజాగుట్ట ఎస్సై అఖిల ఫిర్యాదు చేశారు. రాష్ అండ్ నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేస్తూ తమపైకు వాహనం దూసుకొచ్చేటట్టు షర్మిల కారు నడిపించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా షర్మిల అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుండగా.. వీడియో చిత్రీకరిస్తున్న ఎస్సై మొబైల్ ఫోన్ లాక్కోవటంతో.. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు షర్మిలతో పాటు మరో ఏడుగురిపై 143-గుమిగూడటం, 341-అక్రమ నిర్బంధం, 290-బూతులు తిట్టడం, పబ్లిక్ న్యూసెన్స్, 506-బెదిరింపు, 509- మహిళలను దూషించడం, 336-ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించటం, 353- పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, 382- చోరీ, 149- అక్రమ సమావేశం, 382 ఐపీసీ- దొంగతనం.. లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు షర్మిలతో పాటు ఆరుగురిని రిమాండ్ నిమిత్తం చంచలగూడా జైలుకి తరలించారు.
- Read More Telangana News and Telugu News