శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో ఇటీవలే ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రీ ఎనిమిది నెలల పసికందును నీటి సంపులో వేసి పైకప్పు పెట్టి హత్య చేశాడు. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చంపి వేయబడ్డ బాబు తనకు పుట్టలేదని భార్య చెప్పిందని నిందితుడు వివేక్ చెబుతున్నాడు. దీంతో బాలుడి మృతదేహానికి డిఎన్ఎ పరీక్షలు చేయాలని తండ్రి వివేక్ కోరాడు. ఈ మేరకు సమాధి చేసిన బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. మంగలి విక్రమ్ స్పందన దంపతులకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సజావుగా జరిగిన దాంపత్య జీవితంలో గోడవలు మొదలయ్యాయి. గోడవలు కాస్త తారా స్థాయికి చేరడంతో స్పందన పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత విక్రమ్, స్పందన దంపతులకు ఒక బాబు జన్మించాడు. బాబు పుట్టాక స్పందన విక్రమ్ ను దూరం పెట్టడం మొదలు పెట్టింది. బాబు నీకు పుట్టిన బాబు కాదంటూ తరుచు గొడవలకు దిగేది. దీంతో అమెకు పెద్దలు నచ్చజెప్పి అత్తవారి ఇంటికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో తన బాబును తీసుకెళ్ళి నీటి సంపులో వేసి పై నుండి కప్పు వేశాడు. అయితే అదే సమయంలో అటునుంచి వస్తున్న విక్రమ్ స్నేహితుడికి విషయం చెప్పడంతో అతను కుటుంబ సభ్యులు చెప్పాడు. దీంతో విక్రమ్ కుటుంబ సభ్యులు సంపులో నుండి బాబును వెలికి తీసే సరికి మృతి చెంది ఉన్నాడు. దీంతో విషయాన్ని పొలీసులకు చెప్పడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే బాబు ఎవరివల్ల పుట్టాడో తెలుసుకోవాలని తండ్రి ప్రయత్నం చేశాడు . ఇందులో భాగంగా చనిపోయిన బాబు మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కోరాడు. అదే మాదిరిగా బాబు డీఎన్ఏ పరీక్ష చేయాలని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టాడు. ఈ మేరకు బాబు మృతదేహాన్ని బయటకు తీసి డీఎన్ఏ పరీక్షలకు పంపారు . అయితే నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో తన బాబును తీసుకెళ్ళి నీటి సంపులో వేసి పై నుండి కప్పు వేశాడు. అయితే అదే సమయంలో అటునుంచి వస్తున్న విక్రమ్ స్నేహితుడికి విషయం చెప్పడంతో అతను కుటుంబ సభ్యులు చెప్పాడు. దీంతో విక్రమ్ కుటుంబ సభ్యులు సంపులో నుండి బాబును వెలికి తీసే సరికి మృతి చెంది ఉన్నాడు. దీంతో విషయాన్ని పొలీసులకు చెప్పడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే బాబు ఎవరివల్ల పుట్టాడో తెలుసుకోవాలని తండ్రి ప్రయత్నం చేశాడు . ఇందులో భాగంగా చనిపోయిన బాబు మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కోరాడు. అదే మాదిరిగా బాబు డీఎన్ఏ పరీక్ష చేయాలని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టాడు. ఈ మేరకు బాబు మృతదేహాన్ని బయటకు తీసి డీఎన్ఏ పరీక్షలకు పంపారు . అయితే నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.