యాప్నగరం

పెళ్లైన 15 రోజులకే నవవధువు ఆత్మహత్య.. భర్త వేధింపులు తట్టుకోలేక..!

పెళ్లైన పదిహేను రోజులకే ఓ నవవధువు తనువు చాలించింది. ఎంతో సంతోషంగా ఉంటుందని అత్తారింటికి పంపించిన ఆ వధువు.. తిరిగి పుట్టింటికి వచ్చిన రోజే ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆ నవ వధువు ఆత్మహత్యకు కారణం భర్త వేధింపులే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 19 May 2023, 6:14 pm

ప్రధానాంశాలు:

  • పెళ్లైన 15 రోజులకే నవవధువు ఆత్మహత్య
  • భర్త వేధింపులే కారణమని ఆరోపణలు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bride suicide
సూసైడ్
అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో మరెన్నో కోరికలతో అత్తారింట్లో అడుగు పెట్టింది వధువు. అయితే.. కాళ్లకు పెట్టిన పారాణి ఇంకా ఆరనేలేదు. ఇంటి ముందు వేసిన పందిరి ఇంకా తీయనేలేదు. అంతలోనే పెళ్లికూతురుకు నూరేళ్లు నిండిపోయాయి. కట్టుకున్న వాడే సర్వస్వమనుకుని.. మనసు నిండా ఎన్నో ఊహలు నింపుకుని వెళ్తే.. మొదటి రోజు నుంచే ఆ అమాయకురాలికి అడుగడునా వేధింపులే ఎదురయ్యాయి. స్వర్గంలా ఉంటుందనుకున్న అత్తారిల్లు.. నరకాన్ని తలపించటంతో.. ఆ బాధలు తట్టుకోలేక తనువు చాలించింది ఆ నవవధువు. దీంతో.. ఆ పెళ్లింట తీరని విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

చింతల్ బాపునగర్‌కు చెందిన నవవధువు నిషితకు 15 రోజుల క్రితం.. మేడ్చల్ మండలం డబీర్‌పురా గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డితో వివాహం జరిగింది. అయితే.. పెళ్లి అయిన తర్వాత అత్తారింటికి వెళ్లిన నిషిత.. 15 రోజుల తర్వాత పుట్టినింటికి వచ్చింది. అయితే.. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. నిషిత మాత్రం పుట్టింట్లో నిన్న రాత్రి చున్నితో ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తమ అమ్మాయి.. తిరిగి పుట్టింటికి వచ్చిన రోజే విగతజీవిగా మారటాన్ని చూసి.. ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు.

అయితే.. పెళ్లి జరిగిన 15 రోజులకే నవవధువు ఇలా ఆత్మహత్య చేసుకోవటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవవధువు ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని భావిస్తున్నారు. వరుడి వేధింపులు తట్టుకోలేకనే ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే.. నిషిత తండ్రి నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నార. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వివిధ కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. నిప్పుల 'వర్షం' నుంచి కాస్త ఉపశమనం..!
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.