యాప్నగరం

పెళ్లయి నెల రోజులు తిరగకముందే.. మహిళా టెకీ దారుణం

Hyderabad: తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చేశారని.. ఓ యువతి మనస్తాపం చెంది తన ప్రాణాలనే తీసుకుంది. పెళ్లయి నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది.

Authored byRaj Kumar | Samayam Telugu 27 Apr 2022, 10:39 am
కుటుంబ సభ్యులు తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చేశారని.. ఓ యువతి మనస్తాపం చెంది తన ప్రాణాలనే తీసుకుంది. పెళ్లయి నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన తులసి జ్యోత్స్నకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త గతంలోనే చనిపోవడంతో కుట్టు పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే పెద్ద కుమార్తె జితేంద్రిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు పెళ్లంటే ఇష్టం లేదు. దీంతో ముందు చిన్న కుమార్తెకు పెళ్లి చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ క్రమంలోనే జితేంద్రితపై ఒత్తిడి తెచ్చి గత నెల 27న వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంతోష్‌తో ఆమె వివాహం జరిపించారు. వీరు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని ధర్మారెడ్డి కాలనీలో పది రోజుల కింద అద్దెకు దిగారు. జితేంద్రిత వర్క్ ఫ్రం హోం చేస్తుండగా సంతోష్ ఆఫీస్‌కు వెళ్తున్నారు. రోజూలాగే ఆఫీస్‌కు వెళ్లిన సంతోష్ రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తట్టాడు.

నా పూర్వ జన్మ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నా.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి బాలుడి అదృశ్యం
అయితే ఎంతకు తలుపు తీయకపోవడంతో ఇరుగు పొరుగు సాయంతో తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే జితేంద్రిత ఉరికి వేలాడుతూ విగతజీవిలా కనిపించింది. ఇష్టం లేని వివాహమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.