యాప్నగరం

నుమాయిష్ ఎగ్జిబిషన్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

Numaish Exhibition: ఏటా జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ప్రారంభ‌మ‌య్యే నుమాయిష్.. ఫిబ్రవ‌రి 15వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుండేది. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 1,500 నుంచి 2 వేల వ‌ర‌కు స్టాళ్లను ఏర్పాటు చేసేవారు.

Samayam Telugu 31 Dec 2020, 1:13 pm
హైదరాబాద్‌లో కొత్త సంవత్సరంతో పాటు ఏటా వచ్చేది నుమాయిష్ ఎగ్జిబిషన్. ఈ ప్రదర్శనకు ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ప్రారంభ‌మ‌య్యే నుమాయిష్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ మేరకు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ అధ్యక్షుడు, రాష్ర్ట మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పష్టం చేశారు. క‌రోనా వ్యాప్తి కార‌ణంగానే నుమాయిష్‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. నుమాయిష్ ఎప్పట్నుంచి ప్రారంభిస్తామ‌నేది త్వర‌లోనే వెల్లడిస్తామ‌ని పేర్కొన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
numaish exhibition hyderabad 2021


ఏటా జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ప్రారంభ‌మ‌య్యే నుమాయిష్.. ఫిబ్రవ‌రి 15వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుండేది. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 1,500 నుంచి 2 వేల వ‌ర‌కు స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. పిల్లలు ఆడుకునే ఆట‌ బొమ్మలు, కొయ్య బొమ్మలు, కిచెన్ సామాన్లు, బట్టలు వంటివి ఎన్నో నుమాయిష్‌లోని స్టాళ్లల్లో ల‌భిస్తాయి. ఒక ఇంటికి కావాల్సిన ప్రతి వ‌స్తువు ఈ ఎగ్జిబిష‌న్‌లో దొరుకుతుంది. తినుబండారాల కోస‌ం ఎగ్జిబిష‌న్‌కు వెళ్తార‌న‌డంలో కూడా సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.