యాప్నగరం

TRSలో చేరిన కౌశిక్ రెడ్డి, కండువా కప్పిన KCR.. ఇక ఎవ్వరూ ఆపలేరంటూ వ్యాఖ్యలు

Telangana Bhavan: కౌశిక్‌ రెడ్డికి టీఆర్ఎస్‌లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన్ను ఎవడూ ఆపలేడని.. ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.

Samayam Telugu 21 Jul 2021, 6:19 pm
కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌ రెడ్డి బుధవారం సాయంత్రం టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్‌ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. బుధవారం టీఆర్ఎస్ భవన్‌లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కౌశిక్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కౌశిక్‌ రెడ్డికి టీఆర్ఎస్‌లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన్ను ఎవడూ ఆపలేడని.. ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
Samayam Telugu కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి..
trs


ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయాలు సహజమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కౌశిక్‌ రెడ్డి తండ్రి తనతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమాలు కొనసాగించామని, ప్రొఫెసర్ జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపామని నెమరు వేసుకున్నారు.

‘‘కౌశిక్‌ రెడ్డి తండ్రి సాయినాథ్‌ రెడ్డి నాతో కలిసి పనిచేశారు. నాడు చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాసమితి పార్టీ అప్పట్లోనే 11 ఎంపీ సీట్లు గెలుచుకుంది. నేను ఎన్టీఆర్‌ అవకాశమిస్తే ఎమ్మె్ల్యే అయ్యాను. కష్టపడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక ఎంతో మథనం ఉంది. గొర్రెల పెంపకం విషయంలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.