యాప్నగరం

మేడ్చల్: లోన్‌ యాప్‌ల దారుణ వేధింపులు.. తట్టుకోలేక ఉరేసుకున్న వ్యక్తి

Medchal: కామారెడ్డికి చెందిన చంద్రమోహన్ పదో తరగతి చదివాడు. హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Samayam Telugu 2 Jan 2021, 3:45 pm
విచ్చలవిడిగా రుణాలు అందించిన యాప్ సంస్థలు ఇప్పుడు డబ్బు చెల్లించని వారి పాలిట శాపంగా మారాయి. తాజాగా యాప్ ప్రతినిధులు చేస్తున్న వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్ర మోహన్ అనే యువకుడు వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి సమీప ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
person hangs himself


కామారెడ్డికి చెందిన చంద్రమోహన్ పదో తరగతి చదివాడు. హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తెలిసిన వారి ద్వారా రుణ యాప్‌ల గురించి తెలుసుకొని వాటి ద్వారా లోన్ పొందాడు. అయితే, సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో యాప్ నుంచి ఇతనికి వేధింపులు ఎక్కువయ్యాయి. దీనికి సంబంధించి గతంలో ఇతను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా వేధింపులు ఆగలేదు.

చివరికి చంద్రమోహన్‌ ఫోన్‌లో ఉన్న కాల్ లిస్టులో ఉన్న అందరికీ ఇతని గురించి చెడ్డగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాళ్లకు ఫోన్ చేసి ఇతని గురించి చెడ్డగా మాట్లాడుతూ వేధించారు. దీంతో పరువు పోయిందని భావించి, ఈ వేధింపులు తట్టుకోలేని చంద్రమోహన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.