యాప్నగరం

Hyderabad Biryani: పాతబస్తీలో 'బిర్యానీ' జగడం.. ఏకంగా హోంమంత్రికి ఫోన్..!.

Hyderabad Biryani: హైదరాబాద్ నగరం బిర్యానీకి కేరాఫ్ అడ్రస్. మరీ ముఖ్యంగా పాతబస్తీలో బిర్యానీ టేస్టే వేరు. సాయంత్రం అయ్యిందంటే.. పాతబస్తీలోని హోటళ్లు అన్ని ఫుల్లుగా ఉంటాయి. అయితే.. తాజాగా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఆసక్తికర సంఘటన జరిగింది. బిర్యానీ హోటళ్లు తెరిచి ఉంచే సమయంపై ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశాడు. హోటళ్లు తెరిచి ఉంచే సమయం చెప్పాలని అడిగాడు. అది కూడా అర్ధరాత్రి ఫోన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 29 Sep 2022, 2:52 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లోని పాతబస్తీలో వింత ఘటన
  • బిర్యానీ కోసం హోంమంత్రికి ఫోన్ చేసిన వ్యక్తి
  • అర్ధరాత్రి కూడా తెరిచి ఉంచాలని డిమాండ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Hyderabad Biryani
హైదరాబాద్ బిర్యానీ
Hyderabad Biryani: బిర్యాని పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది భాగ్యనగరం. అలాంటి హైదరాబాద్ నగరంలో రకరకాల బిర్యానీలు ఎంతో ఫేమస్. ముఖ్యంగా పాతబస్తీలోని హోటళ్లలో బిర్యానీ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏ టైం అయినా బిర్యానీ దొరుకుతుందని నమ్మకం. కానీ.. మధ్య హోటళ్లు తెరిచి ఉంచే టైంపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఏకంగా హోంమంత్రికి ఫోన్ చేసిన హోటళ్లు తెరిచి ఉంటే సమయంపై ఆరా తీశాడు. పాతబస్తీ (Old City)లో ఎన్ని గంటల వరకు హోటల్స్ తెరిచి ఉంచాలో చెప్పాలని మహమూద్ అలీని అడిగాడు.
అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తి ఫోన్ చేయడంపై హోంమంత్రి మహమ్మద్ అలీ (Home Minister Mahmood Ali) అసహనం వ్యక్తం చేశారు. తాను హోంమంత్రిని అని.. సవాలక్ష టెన్షన్లు ఉంటాయని మహమూద్ అలీ సమాధానం ఇచ్చారు. అయినా కూడా అర్ధరాత్రి వరకు విక్రయాలు జరగాలా అంటూ.. ఆ వ్యక్తి హోంమంత్రిని అడిగాడు. దీంతో అలా జరగదని.. రాత్రి 11 గంటలకే అన్ని హోటల్స్ (Hyderabad Hotels) మూసివేస్తారని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నిబంధనలు అందరూ ఫాలో అవ్వాల్సిందేనని చెప్పారు.

అయితే.. అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందంటూ.. హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఇవ్వాలంటూ.. హైదరాబాద్ సీపీని కూడా కలిశారు. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. తాజాగా ఫోన్ చేసిన వ్యక్తి హోంమంత్రికి ఆసక్తికర ఫిర్యాదు చేశారు. లేట్ నైట్ వరకు బిర్యానీ విక్రయాలు జరపడం కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదు చేశారు. అయితే.. అర్ధరాత్రి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం ఇప్పుడు అదర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.