యాప్నగరం

పెళ్లైన నాలుగు నెలలకే కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. షాకింగ్ కారణం

రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాచారం పీఎస్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 30 Mar 2021, 2:59 pm

ప్రధానాంశాలు:

  • రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య
  • చెట్టుకు ఉరేసుకున్న కానిస్టేబుల్ మల్లికార్జున
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చెట్టుకు ఉరేసుకున్న కానిస్టేబుల్
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. యూనిఫామ్‌లో చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తిని గమనించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని మరిగూడ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు(25)గా గుర్తించి అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
నల్గొండ జిల్లా దిండి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన సైదులు మర్రిగూడెం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి గత ఏడాది నవంబర్‌లోనే వివాహమైంది. అప్పటి నుంచి దంపతులు మర్రిగూడెంలోనే నివాసం ఉంటున్నారు. పెళ్లైన నెలరోజుల వరకు సజావుగానే సాగిన వీరి కాపురంలో ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన సైదులు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

తిరుమలేశుని గుట్ట సమీపానికి వెళ్లిన సైదులు అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న యాచారం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.