యాప్నగరం

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: నిందితులుగా ఆ ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా..

Hyderabad Police: బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

Samayam Telugu 14 Jan 2021, 10:04 pm
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఉన్న బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భూమా కుటుంబానికి చెందిన అఖిలప్రియ పేరునే కాకుండా మరికొంత మంది పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, అఖిలప్రియ భర్త భార్గవరామ్ తమ్ముడు చంద్రహాస్, భార్గవ్ కుటుంబ సభ్యులనూ నిందితులుగా చేర్చారు. కిడ్నాప్ ప్లాన్ నుంచి నిందితులు పారిపోయే వరకు భార్గవ్ ఫ్యామిలీ సాయం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
Samayam Telugu భూమా అఖిలప్రియ
bhuma akhila


బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

అఖిలప్రియ కస్టడీ ముగియడంతో పోలీసులు గురువారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. దీంతో జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. అక్కడి నుంచి నేరుగా పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.