యాప్నగరం

IND-AUS T20 టికెట్లు.. జింఖానా మైదానం వద్ద లాఠీఛార్జ్.. మహిళ పరిస్థితి విషమం

IND-AUS T20: ఈనెల 25న ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా (India Australia T20 match) మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి (gymkhana grounds) పోటెత్తారు. పోలీసులు, క్రికెట్ అభిమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీఛార్జ్ (Police Lathi charge) చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పలువులు క్రికెట్ అభిమానులతో పాటు, పోలీసులు గాయపడ్డారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 22 Sep 2022, 1:26 pm

ప్రధానాంశాలు:

  • ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్
  • జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత
  • క్రికెట్ అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu match new.
క్రికెట్ అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్
IND-AUS T20: సింకిద్రాబాద్‌లోని జింఖానా మైదానం (gymkhana grounds) వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈనెల 25న ఉప్పల్‌ రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (Hyderabad Cricket Association).. జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి పోటెత్తారు. వేలాదిగా తరలి వచ్చిన క్రికెట్‌ అభిమానులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ (Police Lathi charge) చేశారు. దీంతో మైదానం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది.

మహిళ పరిస్థితి విషమం..
పలువురు క్రికెట్ అభిమానులు (Cricket Fans) స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండగా..యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులకు, పోలీసులకు జరిగిన ఘర్షణలో పలువులు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అంచనాలకు మించి అభిమానులు టికెట్ల కోసం స్టేడియానికి రావటంతో వారిని నిలువరించేందుకు పోలీసులు కష్టపడుతున్నారు.
తెల్లవారు జామునుంచే...
భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల జారీ విషయంలో గతకొత కాలంగా హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల ఉడంటంతో క్రికెట్ లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. గత ఐపీఎల్ మ్యాచ్లు కూడా హైదరాబాద్లో జరగలేదు. దీంతో చాలా కాలం తర్వాత హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుండటంతో.. అభిమానులు టిక్కెట్ల కోసం భారీగా ఎగబడ్డారు. తెల్లవారుజామునుంచే జింఖానా మైదానికి పోటెత్తారు. గంటల తరబడి భారీ క్యూలైన్లలో నిల్చొని టికెట్లు కొనేందుకు పోటీపడ్డారు. వేలాదిగా క్రికెట్ ఫ్యాన్స్ జింఖానాకు తరలిరావటంతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే సులభ ప్రక్రియలో టిక్కెట్లు ఇవ్వడంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైంది. పాస్ల జారీలోనూ గందరగోళం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే టికెట్ల విషయంలో తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్‌సీఏకు ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరికి కేటాయించారు. అనే విషయాలు పక్కాగా చెప్పాలన్నారు. టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.