Hyderabad: హైదరాబాద్ నగర మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్పై తప్పుడు ట్వీట్ పెట్టిన యువకుడిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన చిగుర ప్రశాంత్ అనే వ్యాపారి.., రామ్మోహన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించారంటూ ట్విట్టర్లో ఇటీవల ట్వీట్ చేశాడు. రామ్మోహన్కు, టీఆర్ఎస్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అవాస్తవాలను పోస్టు చేశారంటూ బంజారాహిల్స్కు చెందిన తేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్పై కూడా ప్రశాంత్ ఇలాగే తప్పుడు ట్వీట్లు పెట్టాడని తేజ బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఫేక్ ఐపీఎస్ శ్రీనివాస్ కేసులో టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను సీబీఐ అరెస్టు చేసిందనే వార్తలు వారం క్రితం బయటకు వచ్చాయి. మూడు రోజుల పాటు ఆయన ఫోన్ స్విచ్ఛాప్ రావటంతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిందని పలు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఇటీవల బొంతు రామ్మోహన్ స్పందించారు. సీబీఐ నోటీసులు అందాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. శ్రీనివాస్ను ఒకసారి కలిసిన విషయం నిజమే కానీ.. అతనితో ఎలాంటి లావాదేవీలు లేవని పేర్కొన్నారు. అయితే.. ఈ విషయంలో ఏమైనా నోటీసులు వచ్చినా.. అధికారులకు పూర్తిగా సహరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
"నాకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. నాకు ఆరోగ్యం బాగోలేక ఓ రోజు ఫోన్ స్విచ్ఛాప్ చేశా. దానికి నన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు పుట్టించారు. నాపై తప్పుడు కథనాలు ప్రచురించారు. అవన్నీ ఊహాజనితం. శ్రీనివాస్ను ఓ ఫంక్షన్లో కలిశా. ఒకవేళ సీబీఐ అడిగితే అదే చెబుతా. శ్రీనివాస్ను కలిసిన వారందరికీ నోటీసులు ఇవ్వాలంటే వంద,రెండు వందల మందికి ఇవ్వాల్సి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్నా. ఫోన్ స్విచ్ఛాప్ ఉంటే సీబీఐ వాళ్లు అరెస్టు చేశారు. తీసుకెళ్లారు అని తప్పుడు ప్రచారం చేస్తే ఎలా ?. ఒకవేళ సీబీఐ వాళ్లు నన్ను ప్రశ్నిస్తే.. కచ్ఛితంగా సహకరిస్తా. నేను ఏ తప్పు చేయలేదు. అవినీతి ఆరోపణలు చేయటం సరికాదు. " అని రామ్మోహన్ అన్నారు. ఆ సమయంలోనే ప్రశాంత్ అనే వ్యాపారి రామ్మోహన్పై తప్పుడు ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై తాజాగా కేసు నమోదైంది.
Read More Telangana News And Telugu News
"నాకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. నాకు ఆరోగ్యం బాగోలేక ఓ రోజు ఫోన్ స్విచ్ఛాప్ చేశా. దానికి నన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు పుట్టించారు. నాపై తప్పుడు కథనాలు ప్రచురించారు. అవన్నీ ఊహాజనితం. శ్రీనివాస్ను ఓ ఫంక్షన్లో కలిశా. ఒకవేళ సీబీఐ అడిగితే అదే చెబుతా. శ్రీనివాస్ను కలిసిన వారందరికీ నోటీసులు ఇవ్వాలంటే వంద,రెండు వందల మందికి ఇవ్వాల్సి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్నా. ఫోన్ స్విచ్ఛాప్ ఉంటే సీబీఐ వాళ్లు అరెస్టు చేశారు. తీసుకెళ్లారు అని తప్పుడు ప్రచారం చేస్తే ఎలా ?. ఒకవేళ సీబీఐ వాళ్లు నన్ను ప్రశ్నిస్తే.. కచ్ఛితంగా సహకరిస్తా. నేను ఏ తప్పు చేయలేదు. అవినీతి ఆరోపణలు చేయటం సరికాదు. " అని రామ్మోహన్ అన్నారు. ఆ సమయంలోనే ప్రశాంత్ అనే వ్యాపారి రామ్మోహన్పై తప్పుడు ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై తాజాగా కేసు నమోదైంది.
Read More Telangana News And Telugu News