యాప్నగరం

కిడ్నాప్ కేసు: కస్టడీలోకి అఖిలప్రియ అనుచరులు.. కోర్టు అనుమతి

Bowenpally Kidnap Case: మంగళవారం దీనిపై సికింద్రాబాద్ కోర్టు విచారణ జరిపింది. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతించింది.

Samayam Telugu 19 Jan 2021, 7:12 pm
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన అఖిలప్రియ అనుచరులు మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వీరిని కస్టడీలోకి తీసుకుంటే కిడ్నాప్ వ్యవహారంలో మరింత సమాచారం సేకరించే అవకాశాలు ఉంటాయని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu అఖిలప్రియ (ఫైల్ ఫోటో)
Bhuma akhilapriya


అయితే మంగళవారం దీనిపై సికింద్రాబాద్ కోర్టు విచారణ జరిపింది. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజుల పాటు ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికి చంచల్ గూడ జైల్లో ఉన్న ఇద్దరు నిందితులను బుధవారం నుంచి ఈ నెల 22 వరకు కస్టడీలోకి తీసుకోనున్నారు. బుధవారం ఉదయం బోయిన్ పల్లి పోలీసులు చంచల్ గూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.