Gaddar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజా యుద్దనౌక గద్దర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ఏకనామికల్ ప్రామిస్ చేస్తారని.., కేసీఆర్ మాత్రం పొలిటికల్ ప్రామిస్ చేశారని అన్నారు. నియంతలకు ఏ గతి పట్టిందో సీఎం కేసీఆర్కు కూడా అదే గతి పడుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారని.., అసలు రాజ్యంగాన్ని మార్చాల్సిన అవసరం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో దళితలను మభ్య పెట్టారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ రాజకీయకుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రతి దళితుడికి మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీ ఏమైందని.., ఆ హామీని పక్కన పెట్టి దళిత బంధు ఎందుకు తెచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ను తన జాతీయ అజెండాలో చేర్చాలన్నారు. దాంతో పాటు ప్రజల ఆలోచనలను కేసీఆర్ అర్థం చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు.
Read More Telangana News And Telugu News
Read More Telangana News And Telugu News