యాప్నగరం

హైదరాబాద్: రాష్ట్రపతి నిలయం సందర్శించాలనుకునేవారికి గుడ్ న్యూస్

Rashtrapati Nilayam: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శకులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఎప్పుడైనా రాష్ట్రపతి నిలయానికి వెళొచ్చు. డిసెంబర్ మినహా ఇక నుంచి ఏడాది పొడవునా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయాన్ని వర్చువల్ మోడ్‌లో బుధవారం ప్రారంభించనుంది. ఎంట్రీ ఫీజు మనదశానికి చెందిన వారైతే రూ. 50, విదేశీయులకు రూ. 250గా నిర్ణయించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 23 Mar 2023, 11:55 am

ప్రధానాంశాలు:

  • ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయం ఓపెన్
  • ఈనెల 23న ప్రారంభించనున్న ప్రెసిడెంట్
  • ఎంట్రీ ఫీజు రూ. 50గా నిర్ణయం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rashtrapati Nilayam
రాష్ట్రపతి నిలయం
President Droupadi Murmu: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శించాలనుకునేవారికి శుభవార్త. ఇక ఎప్పుడైనా రాష్ట్రపతి భవనాన్ని సందర్శించే అవకాశం వచ్చింది. చారిత్రక కట్టడాలు, పూల తోటలు, పండ్ల తోటలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే రాష్ట్రపతి నిలయాన్ని గతంలో ప్రెసిడెంట్ శీతాకాల విడిది తర్వాత 15 రోజులు మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉంచేవారు. ఇక నుంచి రాష్ట్రపతి విడిది చేసే డిసెంబర్ నెల మినహా అన్ని రోజుల్లోనూ సాధారణ ప్రజలను సందర్శనార్థం అనుమతించనున్నారు. ప్రజలు వారానికి ఆరు రోజులు (సోమవారాలు , ప్రభుత్వ సెలవులు మినహా) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు. రాష్ట్రపతి భవన్‌ సందర్శించే భారతీయులకు ప్రతి వ్యక్తికి రూ. 50, విదేశీయులైతే రూ. 250గా ఎంట్రీ ఫీజు నిర్ణయించారు.
ఈ మేరకు రాష్ట్రపతి నిలయంలో పునరుద్ధరించిన నాలెడ్జ్ గ్యాలరీ, టన్నెల్ కిచెన్, బట్టర్ ఫ్లై, రాక్, నక్షత గార్డెన్స్, స్టెప్ వెల్స్పలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం (మార్చి 22న) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి భవనం చరిత్రను తెలుసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. రాష్ట్ర పతి నిలయం చరిత్రకి సంబందించిన పూర్తి విషయాలు నాలెడ్జ్ గ్యాలరీలో లభిస్తాయని చెప్పారు. గత నెలలో రాష్ట్ర పతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని ముర్ము ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి రిట్రీట్‌లు ప్రతి భారతీయుడికి చెందుతాయన్నారు.

బ్రిటీష్ కాలంలో రాష్ట్రపతి నిలయం నిర్మించగా.. అందులో 20కి పైగా గదులుంటాయి. 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనం పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పూలు, పండ్ల తోటలు, ఉద్యానవనాలు, ఫౌంటెన్లు ఇలా ప్రతి ఒక్కటి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్‌ కాలంలో వ్యవసాయానికి ఉపయోగించిన ఊట బావులు, ఎటూ చూసినా పచ్చదనంతో రాష్ట్రపతి నిలయం పరిసరాలు ఆహ్లాదాన్ని పంచుతాయి.

జింకల పార్కు, రాక్‌ గార్డెన్‌లను నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో అంతకు ముందు భారీ వృక్షాలు, కొన్ని ఉద్యానవనాలు మాత్రమే ఉండేవి. గత 15 ఏళ్లుగా పచ్చదనానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్ర ప్రసాద్‌ నుంచి ఇక్కడ శీతాకాల విడిది ఆనవాయితీ కొనసాగుతోంది. రాష్ట్రపతి నిలయంలోని 1.20 ఎకరాల్లో 27 నక్షత్రాలు, 9 గ్రహాల పేర్లతో వృత్తాకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.