యాప్నగరం

Hyderabad: లాక్ డౌన్ పాటించరా ? జనాలకు భయం లేదా ?

వందల సంఖ్యలో జనం చేపలు, మటన్, చికెన్ కొనేందుకు పోటెత్తారు. దీంతో మార్కెట్లన్నీ జనంతో కిటకిటలాడాయి. ఈ వీడియోలో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జనానికి కరోనా భయం ఏ మాత్రం లేదని పలువురు మండిపడుతున్నారు .

Samayam Telugu 16 May 2021, 1:36 pm
హైదరాబాద్‌ వాసులు కరోనాకు ఏ మాత్రం భయపడటం లేదు. ఆదివారం వస్తే చాలు చేపల కోసం... మార్కెట్లకు క్యూ కడుతున్నారు. సామాజిక దూరం పాటించకుండా నగరంలోని పలు చేపల మార్కెట్లు, చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో గుమిగూడంతో పాటు అక్కడికి వచ్చిన వారు కొవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించలేదు. భౌతిక దూరం పాటించలేదు సరికదా.. కొందరు మాస్కులు కూడా సరిగా ధరించలేదు.
Samayam Telugu చేపల మార్కెట్‌లో జనం


లాక్‌డౌన్‌ విధించినా కొందరు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రాణం మీదికి వస్తున్నా ఖాతరు చేయడం లేదు. నగరంలోని కూకట్‌పల్లి- జగద్గిరిగుట్ట మార్గంలో ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి రావడంతో కరోనా నిబంధనలు గాల్లో కలిసిపోయాయి. ముషీరాబాద్ చేపల మార్కెట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అసలు కరోనా ఉందా లేదా అన్న విషయం అర్థం కాని పరిస్థితి. దాదాపు కొన్ని వందల మంది చేపల కోసం ఎగబడ్డారు . పూర్తిగా కోవిడ్ రూల్స్‌ను పక్కన పెట్టారు. అసలు కరోనా ఉందా అనే అనుమనం వచ్చింది.

మరికొన్ని చోట్ల ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నా.. ఆ తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్‌ ప్రగతినగర్‌ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తర్వాత కూడా చేపల విక్రయాలు చేపట్టడంతో పోలీసులు అక్కడి వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. లాక్ డౌన్ ప్రజల కోసమే అది జనం గుర్తించిన రోజు.. బాధ్యతంగా ఉన్న రోజే.. ఈ వైరస్‌ను ప్రభుత్వాలు అయిన కట్టడి చేయగలవు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.