యాప్నగరం

ఓల్డ్ సిటీలో నో లాక్‌డౌన్.. రంజాన్ షాపింగ్‌ కోసం పోటెత్తిన జనం

రేపు రంజాన్ పండగ సందర్భంగా షాపింగ్ కోసం జనం ఎగబడ్డారు. ఎక్కడా కూడా లాక్ డౌన్ నిబంధనలు గాని, కరోనా నిబంధనలు కాని పాటించలేదు. భారీగా జనం రావడంతో పోలీసులు సైతం ఏం చేయలేని పరిస్థితి.

Samayam Telugu 13 May 2021, 1:28 pm
రేపే రంజాన్ పండుగ కావడంతో హైదరాబాద్ పాతబస్తీకి జనం పోటెత్తారు. చార్మినార్ అంతా కిటకిటలాడింది. ఉదయం నుంచే వ్యాపారులు దుకాణాలు తెరిచారు. ఫుట్ పాత్ షాపింగ్ సైతం మొదలయ్యింది. దీంతో జనం కూడా పండగ షాపింగ్ కోసం పరుగులు తీశారు. బట్టలు, చెప్పులు, గాజులు ఇలా రకరకాల షాపింగ్ చేసేందుకు క్యూ కట్టారు. దీంతో చార్మినార్‌లో ఎటు చూసిన జనమే జనం కనిపించారు.
Samayam Telugu రంజాన్ షాపింగ్


మరోవైపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే పాతబస్తీలో ఎక్కడా కూడా కరోనా భయం జనంలో కనిపించలేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించకుండా షాపింగ్ నిర్వహిస్తున్నారు పాత బస్తి వాసులు. కొందరు మాస్కులు ధరిస్తే.. మరికొందరు మాత్రం మాస్కులు సరిగా లేకుండానే షాపింగ్‌ చేస్తున్నారు. దీంతో పోలీసులు సైతం ఏం చేయలేక చేతులెత్తేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.