యాప్నగరం

రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు.. తగ్గేదేలే అంటున్న కేసీఆర్ సర్కార్..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రిపబ్లికే డే వేడుకల నిర్వాహణ వ్యవహారం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా.. కోర్టు వరకూ వెళ్లినా.. ప్రభుత్వానికి ధర్మాసనం కూడా ఆదేశాలిచ్చినా.. చివరికి మెనూ మాత్రం మారలేదు. ప్రభుత్వం ముందు చెప్పినట్టుగానే.. రాజ్ భవన్‌లోనే వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయించింది. అయితే.. కోర్టు చెప్పినట్టుగా పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించనుంది. రాజ్ భవన్‌లో అరగంట పాటు పోలీస్ పరేడ్ నిర్వహించనున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 25 Jan 2023, 8:10 pm

ప్రధానాంశాలు:

  • రేపు రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు
  • 6: 50 నుంచి రాజ్‌భవన్‌లో అరగంట పాటు పోలీస్ పరేడ్
  • 7 గంటలకు జెండా ఎగరవేయనున్న గవర్నర్ తమిళిసై

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kcr tamilisai
రిపబ్లిక్ డే వేడుకలు
రిపబ్లిక్ వేడుకల నిర్వాహణపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ తన మాటే నెగ్గించుకుంది. ముందు చెప్పినట్టుగానే.. రేపు జరగబోయే రిపబ్లికే వేడుకలను రాజ్‌భవన్‌లోనే నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. రేపు 6 గంటల 50 నిమిషాలకు పోలీస్ పరేడ్ ప్రారంభమవుతుంది. అరగంట పాటు ఈ పరేడ్ సాగుతుంది. 7 గంటలకు గవర్నర్ తమిళిసై జెండా ఎగురవేయనున్నారు. అయితే.. ఈ రిపబ్లిక్ వేడుకలపై తెలంగాణలో హాట్ డిస్కషన్ నడిచింది. గత రెండేళ్లుగా రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం రాజ్ భవన్‌లోనే నిర్వహిస్తోంది. అయితే.. ఈసారి కూడా పబ్లిక్ గార్డెన్‌లో కాకుండా.. రాజ్ భవన్‌లోనే నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. కాగా.. ఈ నిర్ణయంపై అటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఇటు బీజేపీ పెద్దలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిక్కరిస్తోందని మండిపడ్డారు. ఇదే విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు.
అయితే.. హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి పలు ఆదేశాలిచ్చింది. రిపబ్లిక్ వేడుకలను అధికారికంగానే నిర్వహించాలని తీర్పునిచ్చింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలని కూడా చెప్పింది. అంతే కాదు.. పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. అయితే.. వేడుకలు ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్పందించిన కేసీఆర్ సర్కారు.. ముందు చెప్పినట్టుగానే వేడుకలను రాజ్ భవన్‍‌లోనే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రిపబ్లిక్ డే వేడుకలు ఎప్పటిలా.. ఘనంగా నిర్వహించాలని న్యాయస్థానం చెప్పినా.. కేసీఆర్ సర్కారు మాత్రం చివరికి రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది.

అయితే.. రిపబ్లిక్ వేడుకలను సాధారణంగా ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించేది. కాగా.. కరోనా వల్ల రెండేళ్లుగా గవర్నర్ రాజ్ భవన్‌లో.. కేసీఆర్ ప్రగతి భవన్‌లో జరుపుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కూడా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌లానే నడుస్తోంది. గవర్నర్‌ వ్యవస్థను తప్పు పడుతోన్న కేసీఆర్ సర్కార్.. రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే.. వాళ్లిద్దరికీ అస్సలు పొసగట్లేదు. ప్రొటోకాల్ వివాదాలు తలెత్తుతున్నాయి. అటు గవర్నర్, ఇటు బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా.. కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన పంథాలో వెళ్తున్నారు. కాగా.. ఇప్పుడు రిపబ్లిక్ డే వేడుకల విషయంలోనూ తగ్గేదేలే అంటూ.. తన మాటే నెగ్గించుకుంది కేసీఆర్ సర్కారు.

వాహన తనిఖీల్లో ఘోరం.. ట్రాఫిక్ పోలీస్‌పైకి దూసుకొచ్చిన లారీ.. అక్కడికక్కడే..
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.