యాప్నగరం

Hyderabad: రియల్టర్ హత్యకు స్కెచ్.. రూ. 20 లక్షలకు ఒప్పందం.. మాజీ సీఐ అరెస్ట్

Dasari Bhumaiah: రియల్టర్ హత్యకు కుట్ర పన్నిన కేసులో రిటైర్ట్ సీఐ దాసరి భూమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు భూమయ్య స్కెచ్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 24 Apr 2023, 3:39 pm

ప్రధానాంశాలు:

  • రియల్టర్ హత్యకు మాజీ సీఐ స్కెచ్
  • రూ. 20 లక్షలకు కుదిరిన బేరం
  • కుట్రను భగ్నం చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Dasari Bhumaiah
దాసరి భూమయ్య అరెస్ట్
Dasari Bhumaiah Arrest: మాజీ సీఐ దాసరి భూమయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు కుట్రపన్నిన కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూమయ్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూమయ్య అరెస్టుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన విజయ్ పాల్ రెడ్డి హత్యకు భూమయ్య కుట్ర పన్నినట్లు సీపీ వెల్లడించారు. మరో ముగ్గురు సుఫారీ గ్యాంగ్‌తో కలిసి అతడి హత్యకు స్కెచ్ వేసినట్లు చెప్పారు. విజయ్ పాల్ రెడ్డి, దాసరి భూమయ్య కలిసి గతంలో అనేక రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేశారన్నారు. ఇద్దరు కలిసి హైదరాబాద్ సిటీ శివార్లలో ల్యాండ్ డీలింగ్స్ కూడా చేశారని చెప్పారు.
ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు వచ్చి విజయ్ పాల్‌ను హత్య చేసేందుకు భూమయ్య ఫ్లాన్ చేశాడని సీపీ తెలిపారు. రూ. 20 లక్షలు సుపారీ ఇచ్చి విజయ్ పాల్ అడ్డు తొలగించుకునేందుకు భూమయ్య సిద్ధమైనట్లు వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలో టాస్క్‌పోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు వివరించారు. జనశక్తి నేతతో భూమయ్య ఈ హత్యకు కుట్ర పన్నాడని తెలిపారు. పలు జిల్లాలోని 12 పోలీస్ స్టేషన్లలో భుమయ్య గంతలో పని చేసినట్లు చెప్పా్రు. ఇతను 80 ఎకరాల వరకు భూమిని కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.


భూమయ్యపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. సీఐ విధులు నిర్వహిస్తున్న సమయంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో ఆయన కారులో భారీగా నగదునుపట్టుకున్నారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో తుపాకుల మాయం విషయంలోనూ పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే అవి దొరకడంతో ఆ వివాదం సద్దుమణిగింది. పదవీ విరమణ తర్వాత భూమయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం యాక్టివ్‌గా పనిచేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీంలో చేరి రాష్ట్ర కన్వీనర్‌గా పని చేశారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.