MLA Sayanna: అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ. సాయన్న (72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. షుగర్ లెవల్స్ పడి పోవడం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబసభ్యులు యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇక శాసన సభలో సాయన్న సీనియర్ ఎమెల్యేగా ఉన్నారు. ఆయన మెుత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగు దేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సాయన్న 1994 నుంచి 2004 వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందగా.. మళ్లీ 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లోనూ ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఐదుసార్లు ఎమెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి కోరిక మాత్రం తీరలేదు. తొలిసారిగా తాను ఎమ్మెల్యేగా గెలిచినపుడు టీడీపీ అధికారంలో ఉండగా.. ఆ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు సహచర అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. ఇక 1999లోనూ విజయం సాధించినా.. జూనియర్ కావటంతో ఆయనకు పదవి దక్కలేదు. ఇక 2004లో హ్యాట్రిక్ విజయం సాధించినా.. టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇక 2009లో ఓటమి పాలైన సాయన్న 2014లోనూ టీడీపీ తరపున విజయం సాధించారు.
తెలంగాణ సెంటిమెంట్తో రాష్ట్రం మెుత్తం బీఆర్ఎస్ హవా నడిచినా.. కంటోన్మెంట్లో మాత్రం సాయన్న పసుపు జెండా ఎగురవేశారు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఆయనకు 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం దక్కింది. ఇక మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సైకిల్ దిగి 2016లో కారెక్కారు. 2018లో ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఆయన సర్వే సత్యనారాయణను ఓడించి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
సీనియర్ ఎమ్మెల్యే కావటం, గతంలో కేసీఆర్తో కలిసి టీడీపీలో పని చేసిన నేపథ్యంలో ఈ ధపా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఉహించారు. కానీ కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆయనకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. నిధుల విషయంతో పాటు పార్టీ అంతర్గత విషయాల్లోనూ ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఐదుసార్లు ఎమెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి కోరిక మాత్రం తీరలేదు. తొలిసారిగా తాను ఎమ్మెల్యేగా గెలిచినపుడు టీడీపీ అధికారంలో ఉండగా.. ఆ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు సహచర అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. ఇక 1999లోనూ విజయం సాధించినా.. జూనియర్ కావటంతో ఆయనకు పదవి దక్కలేదు. ఇక 2004లో హ్యాట్రిక్ విజయం సాధించినా.. టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇక 2009లో ఓటమి పాలైన సాయన్న 2014లోనూ టీడీపీ తరపున విజయం సాధించారు.
తెలంగాణ సెంటిమెంట్తో రాష్ట్రం మెుత్తం బీఆర్ఎస్ హవా నడిచినా.. కంటోన్మెంట్లో మాత్రం సాయన్న పసుపు జెండా ఎగురవేశారు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఆయనకు 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం దక్కింది. ఇక మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సైకిల్ దిగి 2016లో కారెక్కారు. 2018లో ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఆయన సర్వే సత్యనారాయణను ఓడించి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
సీనియర్ ఎమ్మెల్యే కావటం, గతంలో కేసీఆర్తో కలిసి టీడీపీలో పని చేసిన నేపథ్యంలో ఈ ధపా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఉహించారు. కానీ కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆయనకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. నిధుల విషయంతో పాటు పార్టీ అంతర్గత విషయాల్లోనూ ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
- Read More Telangana News And Telugu News