యాప్నగరం

మహమ్మారి నుంచి కాపాడుతా.. బోనాలులో అమ్మవారి భవిష్యవాణి

మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తన భక్తులకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకునేందుకు తాను ఎప్పుడూ ఉంటానంది అమ్మవారు. భక్తులకు మహమ్మారి నుంచి కాపాడుకుంటానంది.

Samayam Telugu 26 Jul 2021, 11:30 am
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని రెండో రోజు భక్తులు భారీగా దర్శించుకుంటున్నారు. ఇవాళ రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్య వాణి వినేందుకు భక్తులు పోటెత్తారు. జాతరలో భాగంగా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. ఇవాళ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారి(ఏనుగు)పై ఊరేగింపు జరుగనుంది.
Samayam Telugu రంగంలో భవిష్యవాణి


ఈ సందర్భంగా ఆలయంలో రంగం నిర్వహించారు. మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తన భక్తులకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకునేందుకు ఎప్పుడూ ఉంటానంది అమ్మవారు.
ఈ మహమ్మారి వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎటు సంకోచించకుండా ఇంత పెద్దగా ఉత్సవాలు జరిపేందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వానలతో వరదలు వచ్చి కష్టాలు ఉన్నప్పటికీ తాను కాపాడుకుంటానన్నారు. వ్యాధి తో ఇబ్బంది పడుతున్న కాపాడుకునేందుకు తానున్నానంటూ తల్లి అభయహస్తం ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.