బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భూమా వారసుడికి కోర్టు మరోసారి షాకిచ్చింది. ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ తమ్ముడు భూమా జగత్విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలిన గతంలో కోర్టు సూచించింది. ఈ మేరకు పోలీసులు మూడు రోజుల కిందట కౌంటర్ దాఖలు చేశారు. జగత్విఖ్యాత్కు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని.. బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
అఖిల ప్రియ అత్తమామలకూ షాక్..
కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అఖిల ప్రియ అత్తమామలకు కూడా కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. జగత్విఖ్యాత్, భార్గవ్ రామ్ తల్లిదండ్రుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇద్దరి పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు పరారీలోనే ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ముందస్తు బెయిల్ కావాలంటూ భార్గవ్ రామ్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆయన మరోసారి బెయిల్ కోరుతూ సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హఫీజ్పేట్ భూముల వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్ రావు, అతని సోదరులను ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కేసులో భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టైన అఖిలప్రియ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. నిందితులుగా ఉన్న ఆమె భర్త భార్గవ్ రామ్, గుంటూరు శీను, చంద్రహాస్లు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో అఖిల ప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్, భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
Also Read:
అఖిల ప్రియ అత్తమామలకూ షాక్..
కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అఖిల ప్రియ అత్తమామలకు కూడా కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. జగత్విఖ్యాత్, భార్గవ్ రామ్ తల్లిదండ్రుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇద్దరి పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు పరారీలోనే ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ సికింద్రాబాద్ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ముందస్తు బెయిల్ కావాలంటూ భార్గవ్ రామ్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆయన మరోసారి బెయిల్ కోరుతూ సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హఫీజ్పేట్ భూముల వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్ రావు, అతని సోదరులను ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కేసులో భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టైన అఖిలప్రియ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. నిందితులుగా ఉన్న ఆమె భర్త భార్గవ్ రామ్, గుంటూరు శీను, చంద్రహాస్లు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో అఖిల ప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్, భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: