యాప్నగరం

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 63 మంది నిందితులు.. సుబ్బారావు, శివను విచారిస్తున్న పోలీసులు

కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన విధ్వంసం కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 23 Jun 2022, 2:38 pm
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. అసలు ఈ విధ్వంసానికి కారకులెవరు? ఎవరు వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసి ఆందోళనకారులను రెచ్చగొట్టారు? అసలు ఎవరు మొదటగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి విధ్వంసం సృష్టించారు? ఇలా పలు రకాలుగా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఓవైపు పోలీస్ శాఖ.. మరోవైపు రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Samayam Telugu secunderabad riots


ఇటు విద్యార్థులను రెచ్చగొట్టి ఈ విధ్వంసానికి కారకులైన సాయి డిఫెన్స్ అకాడమీ సుబ్బారావుతో పాటు శివ అనే మరో వ్యక్తిని కూడా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటు ఆందోళనకు కావాల్సిన లాజిస్టిక్స్‌ను వీరు సమకూర్చినట్టు నిర్ధారించారు. అలాగే పలు డిఫెన్స్ అకాడమీ యజమానులు ఆందోళనకారులను ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అలాగే 8 వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసి దాంట్లో ఆందోళనకారులను రెచ్చగొట్టే విధంగా పోస్ట్‌లు చేశారు. అసలు ఈ గ్రూపును క్రియేట్ చేసిన అడ్మిన్ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి మొత్తం పది మంది అడ్మిన్లను అరెస్టు చేశారు. ఈ విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులుగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొదటగా ఈ విధ్వంసానికి పాల్పడిన పృథ్వీ రాజ్‌తో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటు ఏ2గా ఉన్న పృథ్వీరాజ్ సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లుగా ఆధారాలు సేకరించారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 63 మందిని నిందితులుగా చేర్చగా అందులో 55 మంది అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ7 నుంచి ఏ12, ఏ62, ఏ63 ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం కారణంగా రైల్వే శాఖకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.