యాప్నగరం

Vande Bharat: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ టికెట్ ఛార్జీలు ఖరారు.. అధికారికంగా ప్రకటన

Vande Bharat: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సర్వీసులు అందించనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలు ఖారారయ్యారు. ఈ మేరకు అధికారులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఛార్జీల వివరాలను అందుబాటులో ఉంచారు. నేటి నుంచి టికెట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 14 Jan 2023, 11:11 am

ప్రధానాంశాలు:

  • వందే భారత్ టికెట్ ఛార్జీలు ఖరారు
  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రకటన
  • ప్రారంభమైన ట్రైన్ బుకింగ్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Secunderabad to Visakhapatnam
వందే భారత్ ఎక్స్‌ప్రెస్
Vande Bharat: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించిన ఛార్జీల వివరాలు వెల్లడయ్యాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఛార్జీల వివరాలను పొందుపర్చారు. ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల వారీగా ఛార్జీల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో తెచ్చారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగే వివిధ ప్రాంతాల మధ్య ఛార్జీల వివరాలను కూడా ప్రకటించారు.
వందే భారత్ ఛార్జీల విషయానికొస్తే.. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఛైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.1720, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3170గా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఛైర్ కార్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.905, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.1775గా ఉండగా.. రాజమండ్రికి ఛైర్ కార్ ధర రూ.1365, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2485గా ఉంది. క్యాటరింగ్, రిజర్వేషన్, జీఎస్టీ, సూపర్ ఫాస్ట్ ఛార్జీలన్నీ కలిపి ఈ టికెట్ ధరలను నిర్ణయించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు బుకింగ్స్‌ను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో నేటి నుంచి అందుబాటులోకి ఉంచారు. అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా కౌంటర్ల ద్వారా టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ ద్వారా పచ్చజెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. రాత్రి 8.45 గంటలకు ఇది విశాఖకు చేరుకోనుంది. తొలిరోజు ఒక్కరోజు 21 స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగనుంది. సోమవారం నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగనుంది.

తొలుత ఈ నెల 19న ఈ ట్రైన్‌ను నరేంద్ర మోదీ చేతుల మీదుగా సికింద్రాబాద్‌లో ప్రారంభించాలని అధికారులు భావించారు. ఈ మేరకు మోదీ తెలంగాణ పర్యటన కూడా ఖరారు అయింది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. దీంతో ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందేభారత్ ట్రైన్‌ను సికింద్రాబాద్ నుంచి మోదీ ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరగనుండగా.. నిర్వహణ కోసం ఆదివారం సెలవుగా ప్రకటించారు.

మిగతా ఎక్స్‌ప్రెస్‌లలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకోవాలంటే 12 గంటల సమయం పడుతుంది. కానీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు చేరుకోవచ్చు. తొలుత విజయవాడ వరకు తిప్పాలని భావించిన అధికారులు.. ఆ తర్వాత విశాఖ వరకు పొడిగించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.