యాప్నగరం

ఒంటరి మహిళలే టార్గెట్.. హైదరాబాద్‌లో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఒంటరి మహిళలే అతడి టార్గెట్. కల్లు కంపౌడ్‌కు వచ్చిన మహిళల్ని టార్గట్ చేస్తుంటాడు. వారి వద్ద నగదు, నగల్ని మాయం చేస్తుంటాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి కూడా పాాల్పడతాడు.

Samayam Telugu 13 May 2021, 1:50 pm
హైదరాబాద్‌లో సీరియస్ రేపిస్ట్ అరెస్ట్ అయ్యాడు. ఎల్‌బీ నగర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై దోపిడీ, దొంగతనంతో పాటు 20 కేసులు నమోదయ్యాయి. దీనిపై రాచకొండ సీపీ మహేష్ భగత్ మాట్లాడుతూ ... వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న హుస్సేన్ ఖాన్ అనే సీరియల్ రేపిస్ట్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. . ఘట్కేసర్ నారపల్లిలో నివాసం ఉంటున్న హుస్సేన్ ఖాన్.. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు.
Samayam Telugu సీరియల్ అరెస్ట్


ఈ క్రమంలో కల్లు డిపో వద్దకు వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి వద్ద నుంచి నగలు దొంగలిస్తాడు. అంతేకాకుండా వారిపై అత్యాచారానికి పాల్పడతాడు. 2016 లో నిందితుడిపై గోపాలపురం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ క్రమంలో అతడ్ని అరెెస్ట్ చేసిట్లు సీపీ తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.