యాప్నగరం

ఎంపీ కేకే కూతురు హల్‌చల్.. ఎమ్మార్వో ఆఫీసులోకి చొరబడి..!

Shaikpet: బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి విజయలక్ష్మి రెండు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అయితే గ్రేటర్‌ పీఠం ఈసారి మహిళకు రిజర్వు కావడంతో ఆమె హైదరాబాద్‌ మేయర్‌ అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది.

Samayam Telugu 20 Jan 2021, 7:57 pm
టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. బంజారాహిల్స్‌ కార్పోరేటర్ అయిన ఎంపీ కే కేశవరావు కుమార్తె విజయలక్ష్మిపై షేక్ పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆఫీస్‌లోకి బలవంతంగా వచ్చి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొ్న్నారు. తాను హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా అడ్డుకుని, ఆమె దుర్భాషలాడారని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తాను ఎంపీ కేకే కూతురునంటూ నానా హంగామా చేశారని విమర్శించారు. కార్పొరేటర్ విజయలక్ష్మీతోపాటు ఆమె అనుచరులు కూడా తహసీల్దార్ కార్యాలయంలోకి చొరబడి హల్చల్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీనివాస్‌ రెడ్డి ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu కార్పొరేటర్ విజయలక్ష్మి (ఫైల్ ఫోటో)
banjara hills corporator


బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి విజయలక్ష్మి రెండు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అయితే గ్రేటర్‌ పీఠం ఈసారి మహిళకు రిజర్వు కావడంతో ఆమె హైదరాబాద్‌ మేయర్‌ అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఎంపీ కేకే కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె వివాదంలో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే దీనిపై విజయలక్ష్మీ ఇంతవరకు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.