యాప్నగరం

AICC president election: రేవంత్ పిలిస్తే వెళతా.. ఆ విషయాల్లో నాది, ఖర్గేది ఒకటే స్టాండ్: శశి థరూర్

AICC president election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. గాంధీయేతర కుటుంబం పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), శశిథరూర్ (Shashi Thatoor) బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరైన శశిథరూర్ ఇవాళ హైదరాబాద్‌లో (Hyderabad) చేరుకున్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్‌లో (Congress) జరుగుతోంది అంతర్గత చర్చేనని శశిథరూర్‌ అన్నారు. పార్టీలో తామంతా ఒక్కటేనని.. తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యాలేమీ లేవని అన్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 3 Oct 2022, 4:55 pm

ప్రధానాంశాలు:

  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై జరుగుతుంది అంతర్గత చర్చేన్న శశి థరూర్
  • పార్టీలో తామంతా ఒక్కటేనని వ్యాఖ్య
  • బీజేపీని ఎలా ఎదుర్కోవాలనేదానిపైనే ప్రధాన చర్చ అని వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu shashi new
శశి థరూర్
AICC president election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. గాంధీయేతర కుటుంబం పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), శశిథరూర్ (Shashi Thatoor) బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరైన శశిథరూర్ ఇవాళ హైదరాబాద్‌లో (Hyderabad) చేరుకున్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్‌లో (Congress) జరుగుతోంది అంతర్గత చర్చేనని శశిథరూర్‌ అన్నారు. పార్టీలో తామంతా ఒక్కటేనని.. తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యాలేమీ లేవని అన్నారు.
బీజేపీని (BJP) ఎలా ఎదుర్కోవాలనేదానిపైనే తామంతా చర్చిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫండమెంటల్‌ విషయాల్లో తనది, ఖర్గేది ఒకటే స్టాండ్‌ అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తిమంతులనేదే ఇప్పుడు తలత్తిన ప్రధాన ప్రశ్న అని వ్యాఖ్యనించారు. తాను ఇటీవలే ఖర్గేతో మాట్లాడానని..,ఆయనతో మంచి సంబంధాలున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌లో జీ23 అనేదే లేదని.. చెప్పారు. ఖర్గేకు, తనకు ఎవరి విజన్‌ వాళ్లకుందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికు గాంధీ కుటుంబం కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ నాయకులతో తనుకు మంచి సంబంధాలు ఉన్నాయని థరూర్ వెల్లడించారు. టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పిలిస్తే తప్పకుండా గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటానని చెప్పారు.

అయితే.. హైదరాబాద్ చేరుకున్న శశి థరూర్‌కు స్వాగతం పలికేందుకు కనీసం ఒక్క రాష్ట్ర స్థాయి నేత కూడా విమానాశ్రయానికి వెళ్లలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా మల్లికార్జున ఖర్గేకే మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అశంపై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క (Mallu Battivikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధ్యక్ష బరిలో ఖర్గే నిలవడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. శశిథరూర్ కూడా తన నామినేషన్ ఉపసంహరించుకొని.. ఖర్గేకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మల్లికార్జున ఖర్గే అపార అనుభవం ఉన్న నాయకుడని.. ఖర్గే ఎన్నికకు దేశంలని కాంగ్రెస్ నాయకులు అందరూ సహకరించాలని కోరారు. ఖర్గే పేరు తెరమీదకు రావడంతో ప్రతిపక్షాల్లో వణుకు పుట్టిందన్నారు.

ఖర్గే అధ్యక్ష బరిలో నిలుస్తున్నారనే వార్తలతో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని.. వంత పాడుతున్న మీడియాతో బీజేపీ.. ఖర్గేపై విషపూరిచత ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. ఖర్గేను కేవలం ఒక కులానికే పరిమితం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందంటూ ఆగ్రహించారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్ గా పదిసార్లు వరుసగా ఎన్నికల్లో ఓటమి ఎరగకుండా విజయం సాధించిన అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన దక్షిత, నాయకత్వ లక్షణాలు, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత విధేయత కలిగిన గాంధేయవాది అయిన ఖర్గే చరిత్రను తెలుసుకొని విష ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ సూచించారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.