హైదరాబాద్లో లేట్ నైట్ పబ్లో ఉండటం తమ తప్పు కాదని.. షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా అన్నారు.. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు అస్సలు తెలియదని వెల్లడించింది. తెలిస్తే తాము అక్కడికి ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. ఆమె ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.. అందులో కుషితా మాట్లాడుతూ.. ‘అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం.. మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళదామని అనుకునే లోపే పోలీసులు వచ్చారు. అందరిని బాధ్యులను చేయడం.. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదు. పోలీసులు వచ్చారు మా డిటైల్స్ తీసుకున్నారు. మేము పోలీసులకు సహకరించాం.. కావాల్సి వస్తే మా రక్త నమూనాలు (శాంపిల్స్) తీసుకోండి. మేము ఎప్పుడైనా శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధమే.. మీడియా వాళ్లు కొంచెం సంయమనం పాటించాలి.’ అని అన్నారు.
‘పబ్కి వచ్చిన వాళ్ళందరినీ బద్నామ్ చేయడం సరికాదు. మేం ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం. మమ్మల్ని ఇలా బద్నామ్ చేయడం సరికాదు. పబ్లో ఉన్న 150 మందిపై ఇలా ద్రుష్పచారం చేయడం సరికాదు. అందరి రక్త నమూనాలు తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోండి. మేము కూడా సహకరిస్తాం.’ అని చెప్పారు.
ఇలాంటి దుష్ప్రచారం వల్ల తమ కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని కుషిత ఆవేదన చెందారు. ‘అక్కడ పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారిపై చర్యలు తీసుకోండి..! మేము జస్ట్ ఆఫ్టర్ పార్టీకి వెళ్లాం. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయకండి’ అని ఆమె కోరారు..
‘పబ్కి వచ్చిన వాళ్ళందరినీ బద్నామ్ చేయడం సరికాదు. మేం ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం. మమ్మల్ని ఇలా బద్నామ్ చేయడం సరికాదు. పబ్లో ఉన్న 150 మందిపై ఇలా ద్రుష్పచారం చేయడం సరికాదు. అందరి రక్త నమూనాలు తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోండి. మేము కూడా సహకరిస్తాం.’ అని చెప్పారు.
ఇలాంటి దుష్ప్రచారం వల్ల తమ కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని కుషిత ఆవేదన చెందారు. ‘అక్కడ పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారిపై చర్యలు తీసుకోండి..! మేము జస్ట్ ఆఫ్టర్ పార్టీకి వెళ్లాం. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయకండి’ అని ఆమె కోరారు..