యాప్నగరం

4వ అంతస్తు నుంచి ల్యాప్‌టాప్‌ సహా కిందపడ్డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మియాపూర్‌లో విషాదం

Hyderabad: ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ల్యాప్‌టాప్‌తో పాటు నాలుగో అంతస్తు నుంచి కిందపడి దుర్మరణం చెందాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 23 Jun 2022, 6:06 pm
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీప్తి శ్రీనగర్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సందీప్‌ గురువారం (జూన్ 23) ఇంటి నాలుగో అంతస్తు పైనుంచి ల్యాప్‌టాప్‌తో పాటు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సందీప్ వయసు 22 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Representational Image


Also Read:

సికింద్రాబాద్ అల్లర్లు: పెద్ద ప్రమాదమే తప్పింది.. పవర్ కార్‌కు నిప్పు అంటుకొనుంటే!
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.