యాప్నగరం

మెట్రో పిల్లర్‌ను ఢీకొని యువకుడు దుర్మరణం.. న్యూఇయర్ వేళ విషాదం

Chaitanyapuri: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో దిల్‌సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Samayam Telugu 31 Dec 2020, 9:15 pm
సంబరంతో ఎవరికి వారు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు వేగంగా బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం అడుగుపెడుతున్న వేళ అతని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాలివీ..
Samayam Telugu మెట్రో పిల్లర్‌ను ఢీకొని యువకుడు దుర్మరణం
software engineer dies


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో దిల్‌సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు అనే యువకుడు ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై అత్యంత వేగంతో ప్రయాణిస్తూ ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్నాడు. దీంతో రాజు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.