యాప్నగరం

హాస్టల్ పక్కనే సమాధి ప్రత్యక్షం.. ఓయూలో కలకలం

వందల మంది చదువుకునే ఉస్మానియా యూనివర్శిటీలో సమాధి కలకలం రేపింది. ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ సమీపంలో ఈ సమాధిని చూసి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

Samayam Telugu 29 Nov 2021, 3:46 pm

ప్రధానాంశాలు:

  • ఓయూలో సమాధి కలకలం
  • ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ సమీపంలో ఘటన
  • భయాందోళనకు గురైన విద్యార్థులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఓయూలో సమాధి నిర్మించిన ప్రాంతం
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఈసీహెచ్‌-1 హాస్టల్‌కి సమీపంలోని ఇది ఉంది. దానిపై పూలు కూడా చల్లినట్లు ఉండటంతో కొద్దిరోజుల క్రితమే సమాధి చేసినట్లు తెలుస్తోంది.

ఈ సమాధిని చూసిన వెంటనే విద్యార్థులు భయపడిపోయి తమ తమ గదుల్లోకి పరుగులు తీశారు. అయితే అక్కడ జంతువును పూడ్చిపెట్టి ఉంటారని విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఓయూలోకి బయటి వ్యక్తులు రాకుండా కొత్త సెక్యూరిటీ గార్డులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతుండగా.. సమాధి ఘటన భద్రత డొల్లతనాన్ని మరోసారి తేటతెల్లం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఓయూ ఉన్నతాధికారులు, పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.