యాప్నగరం

IPL- 2023 మ్యాచ్‌ల నిర్వహణ భేష్.. HYD పోలీసులకు సన్ రైజర్స్ బృందం కృతజ్ఞతలు

ఐపీఎల్- 2023 సందర్భంగా.. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచులను విజయవంతంగా నిర్వహించినందుకు.. రాచకొండ పోలీసులను ఆ సన్ రైజర్స్ ప్రతినిధి బృందం అభినందించింది. ఈ మేరకు.. సీపీ డీఎస్ చౌహాన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. నకిలీ టికెట్ల అమ్మకాలను అరికడుతూ.. మ్యాచ్‌లను విజయవంతంగా జరిగేలా చూసిన సిబ్బందిని సీపీ చౌహాన్ అభినందించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 20 May 2023, 5:04 pm

ప్రధానాంశాలు:

  • రాజకొండ పోలీసులకు సన్ రైజర్స్ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు
  • సీపీ డీఎస్ చౌహాన్‌ను కలిసిన సన్ రైజర్స్ ప్రతినిధి బృందం
  • సిబ్బందిని అభినందించిన సీపీ డీఎస్ చౌహాన్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sunrisers
సన్ రైజర్స్
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఐపీఎల్- 2023 క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ విజయవంతం అయిన సందర్భంగా హైదరబాద్ సన్‌రైజర్స్ ప్రతినిధి బృందం సీపీ డీఎస్ చౌహన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు చేయడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. అయినా తమ అధికారులు, సివిల్, ట్రాఫిక్ వంటి వివిధ విభాగాల సిబ్బంది కలిసి పనిచేయడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రశాంతంగా మ్యాచ్‌లు జరిగాయని సీపీ తెలిపారు. ప్రత్యేక నిఘా బృందాల ద్వారా ఈ సారి నకిలీ టికెట్లు అమ్మడానికి ప్రయత్నించిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న రాచకొండ పోలిసు సిబ్బందిని కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఓఎస్డీ మహేష్, శరవణన్, సన్ రైజర్స్ ఆపరేషన్స్, జెమిని కిరణ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
అయితే.. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొత్తంగా 7 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఏప్రిల్ 2న ఆదివారం రోజు రాజస్థాన్ రాయల్స్‌తో మొదటి మ్యాచ్ జరగ్గా.. మే 18, గురువారం రోజు చివరి మ్యాచ్ జరిగింది. అయితే.. హోం టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్‌.. చివరి మ్యాచ్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరుకుంది.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి విజయం.. సంబురాల్లో గులాబీ శ్రేణులు
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.