యాప్నగరం

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలో హాస్పిటల్‌లో చేరిక

సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హై బీపీ సమస్య కారణంగా ఆయన జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో చేరారు.

Samayam Telugu 25 Dec 2020, 1:33 pm
సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. అన్నాత్తే సినిమా షూటింగ్ సమయంలో ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో షూటింగ్‌కు బ్రేకులేశారు. తర్వాత ఆయన నగరంలోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం బీపీ పెరగడంతో రజినీని అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు.
Samayam Telugu rajinikanth


డిసెంబర్ 22న రజినీకి కరోనా టెస్టులు చేయగా నెగటివ్ అని తేలిందని అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. రజినీకి హైబీపీ మినహా ఇతర ఆరోగ్య సమస్యలేవి లేవని హాస్పిటల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

కాగా రజినీకి కరోనా పాజిటివ్ అని తాజాగా తేలినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కోవిడ్ లక్షణాలు కనిపించడంతోనే ఆయన హాస్పిటల్‌లో చేరారని ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజినీకాంత్ తమిళనాట కొత్త రాజకీయ పార్టీ ప్రకటన దిశగా చురుగ్గా అడుగులేస్తున్నారు. జనవరిలో కొత్త పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

డిసెంబర్ 12న రజినీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. పార్టీ పనుల కోసం ఆరోజు ఢిల్లీలో ఉన్న రజినీ కాంత్.. మరుసటి రోజు చెన్నై నుంచి హైదరాబాద్ ప్రత్యేక విమానంలో వస్తుండగా.. ఫ్లయిట్‌లోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్, హీరోయిన్ నయనతారతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.