యాప్నగరం

HYD: చదువుకోమని చెప్పడమే ఆ తండ్రి చేసిన తప్పు.. 14వ ఫ్లోర్ నుంచి దూకిన కొడుకు

చదువుకోమని తండ్రి మందలించడంతో ఓ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. హైదరాబాద్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 16 Jan 2022, 8:51 pm
చదువుకోమని తండ్రి మందలించడంతో ఓ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. హైదరాబాద్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
Samayam Telugu ఆత్మహత్య చేసుకున్న భవనం ముందు పోలీసుల దర్యాప్తు


వివరాల్లోకి వెళితే.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో సీ బ్లాక్ 14వ అంతస్తులో అమిత్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. అయితే ఆదివారం ఉదయం తండ్రి అమిత్ తన కొడుకు అద్వైత్‌ను చదువుకోమని గట్టిగా మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అద్వైత్ అదే ఫ్లోర్ నుంచి దూకాడు.. దీంతో కిందపడి అక్కడికక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌ బాడీ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.