యాప్నగరం

అపోలో హాస్పిటల్‌లో చేరిన తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్..!

రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైన నాటి నుంచి తీవ్ర పని ఒత్తిడితో సతమతం అవుతున్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస రావు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఆయన అపోలో హాస్పిటల్‌లో చేరారు.

Samayam Telugu 8 Mar 2021, 9:36 pm
తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు హాస్పిటల్‌లో చేరారు. అపోలో హాస్పిటల్‌లో ఆయనకు కార్డియాక్ ఎవల్యూయేషన్ చేస్తున్నారు. సోమవారం ఉదయం హాస్పిటల్‌లో చేరిన ఆయన.. టెస్టులు చేయించుకుంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి ఆయన అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా కేసుల కట్టడి, వ్యాక్సినేషన్ కోసం విరామం లేకుండా పని చేస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని తెలుస్తోంది.
Samayam Telugu srinivasa rao telangana public health director


కోవిడ్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, హాస్పిటళ్లలో అందుతున్న చికిత్స తదితర పనులతో చాలా రోజులు బిజీగా గడిపిన శ్రీనివాస రావు.. ఇటీవల టీకా పంపిణీ తీరును పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాక.. తొలి రోజు ఎంత మంది టీకా వేసుకున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించారు. గత ఏడాది కాలంలో ఆయన అనేకసార్లు మీడియా ముందుకొచ్చి ప్రజల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నం చేశారు. రూమర్ల విషయంలోనూ ఆయన స్పందించారు. ఫిబ్రవరి 8న ఆయన కోవిడ్ తొలి టీకా వేయించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.