యాప్నగరం

బర్డ్ ఫ్లూ టెన్షన్: చికెన్, గుడ్లు తినాలా వద్దా? ప్రభుత్వం కీలక ప్రకటన

Hyderabad: ఇతర రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్న వేళ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై పలుశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

Samayam Telugu 12 Jan 2021, 7:42 pm
దేశవ్యాప్తంగా పక్షులకు సంబంధించి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయట పడడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతుండడంతో మనుషుల్లోనూ దీనిపై ఆందోళన మొదలయింది. చికెన్, గుడ్ల విక్రయాలు దారుణంగా పడిపోవడంతో ధరలు కూడా నేలను తాకాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చికెన్, గుడ్ల విక్రయాలను కూడా కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
CHicken REcipe


ఇతర రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్న వేళ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై పలుశాఖల అధికారులు, పౌల్ట్రీరంగ నిపుణులతో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని మంత్రులు ఈటల, తలసాని చెప్పారు. చికెన్, గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ రాదని.. పుకార్లతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు.

బర్డ్ ఫ్లూ వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. చికెన్ తినాలా? వద్దా? అనే మీమాంసలో ఉండిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ వ్యాధితో ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం ముందే అప్రమత్తమయిందని.. సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని మంత్రి తలసాని చెప్పారు. అవసరమైన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. చికెన్, కోడిగుడ్డు తింటే బర్డ్‌ఫ్లూ రాదని.. వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతున్నారని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ఇలాంటి సమయంలో మళ్లీ బర్డ్ ఫ్లూపై భయాందోళనలు అవసరంలేదని ప్రజలకు సూచించారు. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి
ఇది కేటీఆర్ నిజమైన ఫోటో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అసలు కథ ఏంటంటే..ఫోటోలు: స్పెషల్ ఫ్లైట్‌లో కరోనా వ్యాక్సిన్ Hydకు.. పెద్ద బాక్సులు, భారీ ఫ్రీజర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.