యాప్నగరం

లాక్‌డౌన్ సూపర్.. ముగ్గురు సీపీలపై హైకోర్టు ప్రశంసలు

లాక్ డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీకి సంబంధించిన ఫుటేజ్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో వాటిని పరిశీలించిన అనంతరం పోలీసులను కోర్టు అభినందించింది.

Samayam Telugu 17 May 2021, 12:39 pm
తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు అభినందించింది. సోమవారం ఉదయం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ మొదలైంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీ తీసిన ఫుటేజ్‌ను ముగ్గురు హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు.
Samayam Telugu సీపీలపై హైకోర్టు ప్రశంసలు


లాక్‌డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 వరకు గైడ్ లైన్స్‌ను పటిష్టంగా అమలు చేసినందుకు ముగ్గురు సీపీలకు హైకోర్టు అభినందనలు తెలిపింది. లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరుపై డీజీపీ కోర్టుకు నివేదిక సమర్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాల్ని కోర్టుకు సమర్పించారు. దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసుల పనితీరును అభినందించింది.

ఇటీవలే పాతబస్తీలో రంజాన్ రోజున హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పర్యటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్‌ను ఓల్డ్ సిటీ ప్రజలు పటిష్టంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పురానా షెహర్‌లో ప్రజలు ఎక్కడా కూడా కనిపించడం లేదన్నారు. పండగ రోజు కూడా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్న పాతబస్తీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.