యాప్నగరం

రహస్యంగా పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. పెద్దల ఎంట్రీ, చివరికిలా

తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయితో ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకంుది

Samayam Telugu 23 Jan 2021, 8:49 am
వారిద్దరూ అమ్మాయిలు. రెండేళ్లు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలోనే అసహజరీతిలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో జీవితాంతం కలిసి జీవించాలనుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి బంధానికి పెద్దలు అడ్డు చెప్పడంతో మనస్తాపానికి గురై ఓ యువతి(19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
Samayam Telugu Images


పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఓ యువతి(19) డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఇంటర్ ఖమ్మం జిల్లా పాల్వంచలో హాస్టల్‌లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో అదే కాలేజీలో చదువుతున్న ఖమ్మం జిల్లా మణుగూరుకి చెందిన ఓ యువతి(24)తో స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకుని ఇద్దరూ గతేడాది జనవరిలో ఇళ్లల్లో నుంచి పారిపోయి వికారాబాద్‌లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని 3 నెలల పాటు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వీరి ఆచూకీ కనిపెట్టి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
అయినప్పటికీ తీరు మార్చుకోని ఇద్దరు యువతులు తరుచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే పసిగట్టి యువతి(19) తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఇదే విషయమై కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన ప్రియురాలు తనకు శాశ్వతంగా దూరమవుతుందన్న ఆందోళన చెందిన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.