యాప్నగరం

సంచలనం : ట్రైనీ ఐఏఎస్, వైరా మాజీ‌ ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు.. మోసపోయిన యువతి!

ట్రైనీ ఐఏఎస్‌పై యువతి ఫిర్యాదు కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని.. ఏకంగా పోలీస్ అకాడమీలోనే తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ యువతి పోలీసులను ఆశ్రయించింది.

Samayam Telugu 21 Oct 2021, 7:15 pm
తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని.. ఏకంగా పోలీస్ అకాడమీలోనే తనపై లైంగిక దాడి చేశాడని ట్రైనీ ఐఏఎస్‌పై యువతి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని.. అతని తండ్రి, మాజీ ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతున్నాడని యువతి ఆరోపిస్తోంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కుమారుడు మృగేందర్ తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడని.. తనకు కజిన్ అవుతానని చెప్పి దగ్గరయ్యాడని యువతి చెబుతోంది.
Samayam Telugu తండ్రి మదన్‌లాల్‌తో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ మృగేందర్
ias mrugender


ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మృగేందర్ మోసం చేశాడని యువతి ఆరోపిస్తోంది. మృగేందర్ ప్రస్తుతం మధురైలో ట్రైనీ ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన తొలుత ఐపీఎస్‌కి ఎంపికయ్యాడని.. ట్రైనింగ్‌లో ఉండగా నేషనల్ పోలీస్ అకాడమీలోని తన గదిలో లైంగిక దాడి చేసినట్లు యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని.. ట్రైనీ ఐఏఎస్‌కి అతని తండ్రి, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ సపోర్ట్ చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. తన కొడుకును మరచిపోకపోతే చంపేస్తానని మాజీ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారంటూ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.