CJI జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన తెలుగు కవులు, రచయితలు
Telangana Raj Bhavan: ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిందని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సీజేఐ చేసిన సేవలను బుద్ధ ప్రసాద్ కొనియాడారు.
Samayam Telugu 16 Jun 2021, 8:32 pm
ప్రధానాంశాలు:
- CJIను కలిసిన తెలుగు కవులు
- శుభాకాంక్షలు తెలిపిన రచయితలు
- శాలువాతో సత్కారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణను తెలుగు కవులు, రచయితలు తెలంగాణ రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ, కవి ఎన్ గోపి, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్ సహా పలువురు రచయితలు, కవులు జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన సీజేఐని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. తెలుగును ఎంతో అభిమానించే జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిందని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సీజేఐ చేసిన సేవలను బుద్ధ ప్రసాద్ కొనియాడారు.