యాప్నగరం

శ్మశానవాటిక విషయంలో కులాల గొడవ.. గ్రామంలో అలజడి

Rangareddy: శ్మశానవాటిక విషయంలో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ గ్రామంలో అలజడికి కారణమైంది. గ్రామంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరణిస్తే, దహన సంస్కారాల్లో పాల్గొనద్దని మరో వర్గం తీర్మానం చేసింది. దీంతో గొడవ మరింత ముదిరింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని దామరగిద్ద గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 10 Apr 2023, 7:27 pm
శ్మశానవాటిక స్థల వివాదం గ్రామంలో రెండు కులాల మధ్య చిచ్చు పెడుతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం దామరగిద్ద గ్రామంలో గత రెండు నెలలుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. దామరగిద్ద గ్రామంలో గత ప్రభుత్వాల హయాంలో బీసీలకు శ్మశానవాటిక కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించారు. బీసీ కులస్థుల్లో ఎవరు మరణించినా అక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆ భూమిని ఆనుకొని ఎస్సీ వర్గానికి చెందిన గృహాలు ఉన్నాయి. తమ నివాసాలకు చెంతనే దహన సంస్కారాలు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంత కాలంగా ఇరువర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.
Samayam Telugu tension in damergidda village in chevella over burial ground
శ్మశానవాటిక విషయంలో కులాల గొడవ.. గ్రామంలో అలజడి


గ్రామంలో బీసీ వర్గానికి చెందినవారు ఎవరు మరణించినా.. దహన సంస్కారాల్లో పాల్గొనబోమని ఎస్సీ వర్గం ప్రజలు తీర్మానించుకున్నారు. ఇది ఇరువర్గాల మరిన్ని గొడవలకు కారణమైంది. సోమవారం (ఏప్రిల్ 10) దామోదర్ అనే గ్రామస్థుడు మృతి చెందారు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లగా.. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించొద్దంటూ ఎస్సీ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో పరిస్థఇతి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న చేవెళ్ల ఏసీపీ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి దామరగిద్ద గ్రామానికి వచ్చారు. ఇరు వర్గాల ప్రజలకు నచ్చజెప్పి దహన సంస్కారాలు జరిగేలా చూశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.