Hyderabad: పదో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థి రాసిన లెటర్.. కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ లెటర్ రాసి పెట్టి మరీ.. ఆత్మహత్య చేసుకోవటం పలువురిని కలచివేసింది. ఈ ఘటన హైదరాబాద్ మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాయుడు శ్రీ వెంకటేశ్వర్లు కుటుంబం కేవీఆర్ టవర్స్లో నివాసముంటోంది. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. తల్లి శిరీష ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీళ్ల కుమార్తె (14) పటాన్చెరు బీరంగూడలోని అకాడమిక్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కాగా.. శుక్రవారం రోజు.. విద్యార్థిని పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. అనంతరం తన బెడ్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. చాలా సేపటి వరకు విద్యార్థిని బయటికి రాకపోవడంతో తల్లి, సోదరుడు తలుపు కొట్టగా ఎలాంటి ఉలుకూ పలుకు లేదు. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. విద్యార్థిని సీలింగ్ ప్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దింపి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో.. ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
అయితే.. ఆ విద్యార్థిని రాసి పెట్టిన లెటర్ మాత్రం ఆలోచింపజేస్తుంది. తన గదిలోని ఓ పేపర్పై "హాయ్ అమ్మా, నాన్న, మోహిత్. నేను అసలు ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి... ఐ లవ్ యూ." అని రాసి పెట్టింది. దీంతో.. చదువులో ఒత్తిడి భరించలేకే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అయితే.. ఆ విద్యార్థిని రాసి పెట్టిన లెటర్ మాత్రం ఆలోచింపజేస్తుంది. తన గదిలోని ఓ పేపర్పై "హాయ్ అమ్మా, నాన్న, మోహిత్. నేను అసలు ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి... ఐ లవ్ యూ." అని రాసి పెట్టింది. దీంతో.. చదువులో ఒత్తిడి భరించలేకే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
- Read More Telangana News And Telugu News