యాప్నగరం

Hyderabad Police: భాగ్యనగరంలో కలకలం.. టెర్రర్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

Hyderabad Police: హైదరాబాద్ నగరంలో మరోసారి కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలతో పాటు పేలుళ్లకు కుట్ర చేసిన జాహిద్‌ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో జరిగిన మక్కామసీదు పేలుళ్ల కేసులోనూ జాహిద్‌ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 2 Oct 2022, 3:53 pm

ప్రధానాంశాలు:

  • భాగ్యనగరంలో టెర్రర్ కుట్ర కలకలం
  • టెర్రర్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
  • జాహిద్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Zahid
జాహిద్
Hyderabad Police: హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలను పోలీసులు కనిపెట్టారు. టెర్రర్ కుట్రను భగ్నం చేశారు. భాగ్యనగరంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలతో పాటు పేలుళ్లకు కుట్ర చేసిన జాహిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతన్ని పోలీసులు తమవెంట తీసుకెళ్లారు. అయితే.. జాహిద్‌ (Zahid)కు సంబంధించి ప్రాథమికంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కలకలం రేపాయి.
జాహిద్.. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువకులను రిక్రూట్‌మెంట్ చేశాడని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం జాహిద్ రిక్రూట్ చేశాడని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Hyderabad Police) జాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మక్కా మసీదు పేలుళ్ల కేసులోనూ జాహిద్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. అయితే.. జాహిద్‌ పోలీస్ కస్టడీలో ఉన్నాడా? అతన్ని ఏ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారో తమ తెలియదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

జాహిద్.. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పేలుళ్ల (Hyderabad Blasts)కు ప్లాన్ చేశాడు.. అతని వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అతను రిక్రూట్ చేసిన యువకులను ఎక్కడికి పంపాడు.. వారు ఎవరు.. ఇతనికి ఎలా పరిచయం అనే అంశాలను పోలీసులు రాబడుతున్నారు. అంతేకాదు.. జాహిద్ టార్గెట్ చేసిన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు ఎవరు.. వారిని ఎందుకు టార్గెట్ చేశారనే కోణంలోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.