యాప్నగరం

Weather: అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు.. ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక

Weather: తెలంగాణలో ఇటీవల కొద్దిరోజుల పాటు వర్షాలు కురవగా.. మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు భానుడి తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 27 May 2023, 8:39 am
Weather: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పోడి వాతావరణం ఉంటుందని, గరిష్టంగా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
Samayam Telugu summer
సమ్మర్


జూన్ తొలివారం నుంచే రాష్ట్రంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని సూచించింది. ఇప్పటికే ఎండలతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తోన్నాయి. దీంతో ప్రజలకు వడదెబ్బకు గురై ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలానికి చెందిన వాంకుతోడు సునీత అనే వ్యక్తి వడదెబ్బకు శుక్రవారం కన్నుమూశారు.

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నల్లగొండలో అత్యధిక ఉష్ణోగ్రత 42.5 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. హయత్‌నగర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 25.2 డిగ్రీలు నమోదైంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకుపైగా నమోదైంది. నిన్న హైదరాబాద్‌లో గరిష్టం 37.2, కనిష్టం 27.9, ఖమ్మంలో గరిష్టం 41.4, కనిష్టం 29.0, మెదక్‌లో గరిష్టం 40.6, కనిష్టం 24.0, నల్లగొండలో గరిష్టం 42.5, కనిష్టం 24.4, నిజామాబాద్‌లో గరిష్టం 40.4, కనిష్టం 29.0 డిగ్రీలు నమోదైంది. రామగుండంలో గరిష్టం 41.6, కనిష్టం 28.0, హనుమకొండలో గరిష్టం 39.0, కనిష్టం 27.5, దుండిగల్‌లో గరిష్టం 38.2, కనిష్టం 27.6, హకీంపేట్‌లో గరిష్టం 35.2, కనిష్టం 26.1, భద్రాచలంలో గరిష్టం 39.0, కనిష్టం 28.09, ఆదిలాబాద్‌లో గరిష్టం 41.3, కనిష్టం 26.2 డిగ్రీలు నమోదైంది.

అయితే రాష్ట్రంలో ఇటీవల కొద్దిరోజుల పాటు భారీగా వర్షాలు కురిశాయి. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. ఇప్పుడు ఎండలు దంచికొడుతుండగా.. 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.


  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.