యాప్నగరం

వీడు మామూలు కేటుగాడు కాదు.. అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లో దందా..!

Fake Certificates: ఓయూ నకిలీ సర్టిఫికెట్‌కు యూఎస్‌ లింక్‌లు బయటపడటం కలకలం రేపుతోంది. తాజాగా.. అమెరికాలో ఉన్న ముద్దం స్వామి అనే వ్యక్తి పేరు బయటకొచ్చింది. అయన్ను హైదరాబాద్ రప్పించి.. ఈ కేసులో పురోగతి సాధించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఎంతమంది ఫేక్ సర్టిఫికేట్లతో ఇతర దేశాలకు వెళ్లారనే దానిపై కూపీ లాగుతున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 17 Aug 2022, 2:17 pm

ప్రధానాంశాలు:

  • ఓయూ ఫేక్ సర్టిఫికెట్‌కు అమెరికా లింక్‌లు
  • తాజాగా బయటకొచ్చిన ముద్దం స్వామి వ్యవహారం
  • ఫేక్ సర్టిఫికేట్ల కేసులో కొనసాగుతున్న విచారణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu investigation is going on in the case of fake OU certificates
ఫేక్ సర్టిఫికేట్ల కేసులో కొనసాగుతున్న విచారణ
Fake Certificates: ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికేట్ల కేసులో రాచకొండ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా.. ముద్దం స్వామి అనే వ్యక్తి గురించి కీలక విషయాలు బయటకొచ్చాయి. అమెరికాలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బీటెక్ లో 11 సబ్జెక్టులు ఫెయిల్ అయిన దయాకర్ రెడ్డికి.. ఓయూ (Osmani University) ఇంజినీరింగ్ సర్టిఫికేట్లు అందజేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి రావడంతో.. నాచారం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అమెరికా నుంచి ముద్దం స్వామిని రప్పించేందుకు ఎల్వోసీ జారీ చేశారు. ఇప్పటికే ముద్దం స్వామి (Muddam swamy) పదుల సంఖ్యలో విద్యార్థులకు నకిలీ సర్టిఫికేట్లు పంపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నకిలీ సర్టిఫికేట్లు ద్వారా విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోయారు. ముద్దం స్వామి కూడా.. ఓయూలో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసినట్లు.. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి 2021లో అమెరికా (America) వెళ్లిపోయాడు.

విదేశాలకు వెళ్లడానికి నకిలీ సర్టిఫికేట్లు కావాల్సిన వారితో.. అమెరికా నుంచి ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ముద్దం స్వామీ మాట్లాడుతాడని పోలీసులు చెబుతున్నారు. ఓలా రైడర్స్ ద్వారా ఇంటి వద్దకే నకిలీ సర్టిఫికేట్లు పంపుతున్నట్లు విచారణ వెల్లడైంది. దీంతో అమెరికా నుంచి ముద్దం స్వామిని రప్పించిన తరువాత.. కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టాలని రాచకొండ పోలీసులు (Rachakonda Police) ప్లాన్ చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.