యాప్నగరం

బరితెగించిన దొంగలు.. శ్మశానవాటికలోనూ చోరీ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో దొంగలు బరి తెగిస్తున్నారు. సందు దొరికితే ఎక్కడైనా చోరీలకు తెగబడుతున్నాయి. ఓ శ్మశాన వాటికలో రాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు కొందరు దుండగులు..

Authored byRaj Kumar | Samayam Telugu 18 May 2022, 1:21 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
మహానగరంలో దొంగలు బరి తెగిస్తున్నారు. అక్కడా ఇక్కడా అని లేదు.. ఆదమరిస్తే చాలు ఎక్కడైనా చోరీలకు తెగబడున్నారు. హైదరాబాద్‌లో కొందరు కేటుగాళ్లు శ్మశాన వాటికలోనే దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నల్లవాగు శ్మశాన వాటికలో చోరీ జరిగింది. నిత్యం రద్దీగా ఉండే నల్లవాగు శ్మశానవాటికలో మంగళవారం పలు మృతదేహాలకు దహన సంస్కారాలు జరిపిన అనంతరం ప్రధాన ద్వారానికి తాళాలు వేసి అక్కడి సిబ్బంది వెళ్లి పోయారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో శ్మశాన వాటికలోని గదిలో చోరీకి పాల్పడి రూ.30 వేల నగదు, డీజిల్, బ్యాండ్ సామాను, దహన సంస్కారాలు కోసం వాడే ఇత్తడి సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

నిఘా లోపం కారణంగానే చోరీ జరిగిందని.. సీసీ కెమెరాలున్న పనిచేయకపోవడంతోనే దొంగలు అంతకు తెగించారని శ్మశానవాటిక నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏరియాలో పలుమార్లు దొంగతనాలకు పాల్పడిన ఘటనలున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ వారు వాపోతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.