అన్నారం జంక్షన్లో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
షిఫ్టక్ కారు డివైడర్ను ఢీకొట్టింది. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని కూడా బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Samayam Telugu 28 Feb 2021, 10:09 am
ప్రధానాంశాలు:
- ముందుగా డివైడర్ను ఢీకొన్న కారు
- తర్వాత ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న కారు
- మృతుల్లో బాలుడు, ఒకరి పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న షిఫ్ట్ కారు అన్నారం వై జంక్షన్ వద్ద డివైడర్ను ఢీకొని అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో బాలునితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ రోజు తెల్లవారుజామున 6గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అన్నారం వై జంక్షన్ వద్ద షిఫ్ట్ కారు అతి వేగంతో డివైడర్ ను ఢీకొంటు ఎదురుగా అటువైపు వస్తున్న లారీని ఢీకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు చేపలు పట్టేందుకు సరదాగా వెళుతూ ప్రమాదానికి గురైనట్లు ప్రాధమిక సమాచారం అందింది. వారు ఏ గ్రామానికి వెళ్తున్నారనే సమాచారం తెలియరాలేదు.
హైదరాబాద్ నుండి రెండు వాహనాల్లో వీరు బయలుదేరినట్టు తెలుస్తోంది. మరో వాహనంలో వచ్చిన వారు వీరి పూర్తి వివరాలు చెప్పలేదు. సంఘటనా స్థలంలో ఇద్దరు దుర్మరణం పాలవగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.
మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నుండి రెండు వాహనాల్లో వీరు బయలుదేరినట్టు తెలుస్తోంది. మరో వాహనంలో వచ్చిన వారు వీరి పూర్తి వివరాలు చెప్పలేదు. సంఘటనా స్థలంలో ఇద్దరు దుర్మరణం పాలవగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.
మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.