యాప్నగరం

Outer Ring Road: కీసరలో ఘోర ప్రమాదం.. ఏసీపీ భార్య, బంధువుల మృతి

హైదరాబాద్ ఏసీపీ ప్రసాద్ భార్య సహా, బంధువులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా చీరాలో వివాహ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 25 Oct 2021, 1:36 pm
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట్ వైపు వెళ్తున్న కారు కీసర వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ భార్య శంకరమ్మ(48), బంధువులు బాలకృష్ణ(48), ఆయన భార్య రేణుక(42), వారి కుమారుడు భాస్కర్‌(20)తో కలసి ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకలకు వెళ్లారు. వివాహానంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తెల్లవారుజాము సమయంలో అతివేగంగా వచ్చిన కారు కీసర మండలం యాద్గార్‌పల్లి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకరమ్మ, రేణుక సంఘటన స్థలంలోనే మృత్యువాతపడ్డారు. తీవ్రగాయాలపాలైన బాలకృష్ణ, భాస్కర్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలకృష్ణ ప్రాణాలు విడిచారు. భాస్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రమాదానికి గురైన కారు
accident


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.